
త్వరలో తెలుగులో రాబోతున్న చిత్రాలలో మంచి హైప్ తెచ్చుకొన్న చిత్రం “ఉప్పెన”. మెగా మేనల్లుడు , సాయి తేజ్ కి తమ్ముడు అయిన వైష్ణవ తేజ్ ఈ చిత్రం ద్వారా వెండితెర కు పరిచయం కాబోతున్నాడు అతనికి జోడీ గా కృతి శెట్టి పరిచయం కాబోతుంది. ఇక చిత్రానికి రచన , దర్శకత్వం వహించిన బుచ్చి బాబు సానాకి కూడా ఇది తొలి చిత్రమే …..ఇలా కొత్త తారలతో నిర్మించ బడ్డ ” ఉప్పెన ” చిత్రం నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ క్రమంలో ఇపుడు తమిళం లో రీమేక్ కాబోతుంది.
కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి `ఉప్పెన `చిత్రంలో హీరోయిన్ తండ్రిగా , విలన్ గా నటించడం జరిగింది.దాంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ కొని తమిళం లో నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ తమిళ చిత్రం లో హీరోగా ఒక కొత్త నటుడిని పరిచయం చేయాలను కొంటున్నాడు తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కుమారుడైన “జాసన్ సంజయ్ “ని ఈ చిత్రం ద్వారా హీరో గా కోలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు . ఇక హీరోయిన్ గా తెలుగులో నటించిన కృతిశెట్టి నే నటింప చేసే అవకాశాలున్నాయి. కాగా సేతుపతి విజయ్ తెలుగులో పోషించిన పాత్రనే తమిళం లో కూడా చేయ బోతున్నాడు. దర్శకుడి విషయం లో ఇంకా ఒక నిర్ధారణకు రాని విజయ్ సేతుపతి తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారి తోనే తమిళ్ లో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నాడు .