Vijayashanthi: ఎన్టీయార్ ను ఉద్దేశించి చిరంజీవి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయశాంతి…

చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయంగా కూడా ఎదగాలని చూశారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అలాంటి నీచమైన రాజకీయాలని తన ఎదుర్కోలేక సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.

Written By: Gopi, Updated On : February 29, 2024 10:30 am
Follow us on

Vijayashanthi: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీ లో కొందరికి మాత్రమే స్టార్ డమ్ అనేది దక్కుతుంది. అందులో హార్డ్ వర్క్ చేస్తు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొని నిలబడి, సమస్యలతో పోరాడిన వారికే ఇక్కడ సక్సెస్ దక్కుతుంది. అలా పోరాడి వచ్చినవాళ్లలో చిరంజీవి(Chiranjeevi) ఒకరు. ఈయన ఒకప్పుడు ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కడే హీరోగా ఎదిగాడు.

మెగాస్టార్ గా కూడా తన స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయంగా కూడా ఎదగాలని చూశారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అలాంటి నీచమైన రాజకీయాలని తన ఎదుర్కోలేక సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక తను రీ ఎంట్రీ లో చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవితో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విజయశాంతి చిరంజీవి మీద అప్పట్లో కొన్ని కామెంట్లను చేసింది.

ఇక ప్రస్తుతం అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. అవి ఏంటి అంటే ‘రామారావు(NTR) గారిలా సీఎం అయి పోదాము అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఊరు ఊరు తిరిగి ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకున్నాడు’. అలా వాళ్లకు న్యాయం కూడా చేయగలిగాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏ సి ల్లో ఉంటూ ఓవర్ నైట్ లో పదవులు రావాలి అంటే ఎలా వస్తాయి. కష్టపడాలి అంటూ ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి మీద కామెంట్లు చేసింది.

ఇక దానికి చిరంజీవి అభిమానులు కూడా విజయశాంతి మీద కామెంట్లు అయితే చేశారు. ఇక మొత్తానికి అయితే విజయశాంతి ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ శాంతి కాంగ్రెస్ పార్టీ లో మెంబర్ గా ఉంది , కానీ చిరంజీవి మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు…