Vijay with Vamsi Paidipally: సౌత్ క్రేజీ కాంబినేషన్ ఖరారు..  ఆనందంలో  ఫ్యాన్స్ !   

Vijay with Vamsi Paidipally: ‘మున్నా’, ‘ఊపిరి’, ‘మహర్షి’  లాంటి భారీ  చిత్రాలతో   స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి.  పైగా  పెద్ద చిత్రాల దర్శకుడిగా  కూడా  ఇండస్ట్రీలో వంశీకి  మంచి పేరు ఉంది.   ఇప్పటికే  నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్  ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్  రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలతోనే  సినిమాలు తీసిన వంశీ,    ఇప్పుడు ఏకంగా తన కెరీర్ […]

Written By: Shiva, Updated On : September 27, 2021 4:11 pm
Follow us on

Vijay with Vamsi Paidipally: ‘మున్నా’, ‘ఊపిరి’, ‘మహర్షి’  లాంటి భారీ  చిత్రాలతో   స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి.  పైగా  పెద్ద చిత్రాల దర్శకుడిగా  కూడా  ఇండస్ట్రీలో వంశీకి  మంచి పేరు ఉంది.   ఇప్పటికే  నేషనల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్  ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్  రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలతోనే  సినిమాలు తీసిన వంశీ,    ఇప్పుడు ఏకంగా తన కెరీర్ లోనే  మరో  బిగ్గెస్ట్ స్టార్ అయిన  తమిళ సూపర్ స్టార్ విజయ్(Tamil Super Star Vijay) హీరోగా   ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.   

అయితే,  వంశీ పైడిపల్లి (Vamsi Paidipally)  విజయ్‌తో సినిమా చేస్తున్నాడు అని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  అయితే, తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో  సినిమాని  చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఇక వంశీ పైడిపల్లి  ఈ సినిమా పై ట్వీట్ చేస్తూ..  ‘నా సొంత బ్యానర్‌ లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో  స్టార్ హీరో  విజయ్‌ హీరోగా  ఒక సినిమా చేస్తున్నాను.  ఈ విషయాన్ని   తెలియజేస్తున్నందుకు నాకు  చాలా సంతోషంగా ఉంది’ అని  వంశీ పోస్ట్  చేశారు.  

ఇక కథానాయకుడిగా విజయ్‌ కి ఇది 66వ సినిమా.  పైగా   దిల్ రాజు నిర్మాతగా ఈ  సినిమా రాబోతుంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి,   విజయ్ ను కలిసి కథ చెప్పాడు.  విజయ్ కి  కథ బాగా   నచ్చింది. అందుకే   వీరి కాంబినేషన్ లో  తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రాబోతుందని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

అన్నట్టు  ఈ సినిమాలో నయనతారతో పాటు   కీర్తి సురేష్ కూడా  ఒక హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.  కీర్తి సురేష్ గతంలో కూడా  విజయ్ తో కలిసి నటించింది.  అటు వంశీ పైడిపల్లి  కూడా మహర్షి  సినిమాలో  మొదట   కీర్తి సురేష్ నే హీరోయిన్ గా అనుకున్నాడు.  కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు కీర్తికి ఆ ఛాన్స్ మిస్ అయింది.   ఇప్పుడు ఈ సినిమాలో  వంశీ పైడిపల్లి   ఆమెనే  హీరోయిన్ పెట్టుకుంటున్నాడు.