Varanasi Movie: అందరూ ఆలోచించే విధంగా రాజమౌళి ఆలోచించడు , అందుకే అతను రాజమౌళి అయ్యాడు. తన కొత్త రకమైన ఆలోచనకు తోడు , తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన రైటింగ్ తోడై , బాక్స్ ఆఫీస్ వద్ద వెండితెర అద్భుతాలు ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. అలా ఆయన లేటెస్ట్ గా సృష్టిస్తున్న వెండితెర అద్భుతం ‘వారణాసి’. మనం ఎంతో పవిత్రం గా భావించే రామాయణం కి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని జోడించడమే కాకుండా, అద్భుతమైన ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ని కూడా కలిపి , ఇప్పటి వరకు ప్రపంచం లో ఎవ్వరూ చూడని సరికొత్త జానర్ సినిమాని చూపించబోతున్నాడు. ఇది రామాయణం కి సంబంధించిన స్టోరీ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సాధారణంగా రామాయణం అంటే ఏమి చూపిస్తారు?, రాముడు , రావణుడి మధ్య పోరాటం , సీతని అపహరించుకొని వెళ్లడం, హనుమంతుడి విన్యాసాలు, వానరసైన్యం భీభత్సం ఇవే కదా చూపిస్తారు?.
కానీ మొట్టమొదటిసారి రామాయణం లో శ్రీ రాముడు , కుంభకర్ణుడి మధ్య జరిగిన భీకర పోరాటాన్ని వెండితెర పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఈ ఎపిసోడ్ సినిమాలో దాదాపుగా 30 నిమిషాల వరకు ఉంటుందట. రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉండే ఈ సీక్వెన్స్ ని ఆడియన్స్ తరతరాలుగా గుర్తించుకుంటారట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి , ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా , ఆగస్టు 9 న శ్రీరాముడి లుక్ లో ఉండే మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట రాజమౌళి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా బయటకు రానుంది.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా , మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇక విలన్ గా మలయాళం టాప్ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే , ఈ చిత్రం లో కుంభకర్ణుడు , హనుమంతుడు , లక్ష్మణుడు పాత్రలను ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్నీ విదేశీ భాషల్లోనూ విడుదల కాబోతుంది . ఈసారి రాజమౌళి ఏకంగా హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు , ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
