Homeఎంటర్టైన్మెంట్Maharshi Movie: జాతీయ పురస్కారం అందుకున్న మహర్షి టీమ్...

Maharshi Movie: జాతీయ పురస్కారం అందుకున్న మహర్షి టీమ్…

Maharshi Movie: 67 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న వైభవంగా  జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ అవార్డుల ప్రదానంలో ఆలస్యం జరిగింది. కాగా ఈ ఏడాది మార్చి లో ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మన దేశ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించారు.

vamsi paidipalli receiving national film award for maharshi movie

మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే  ఈ సినిమాలో నటించారు. ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రేక్షకుల నుంచి ఈ  సినిమాకు మంచి ఆదరణ లభించింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ జనాదరణ పొందిన  చిత్రం గా జాతీయ అవార్డ్ అందుకోవడం పట్ల…   మహర్షి టీమ్ కు  అభిమానులు , సినీ తారలు శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ అవార్డ్ అందుకోవడం గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తపరిచారు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని…  ఈ గౌరవం మొత్తం మహర్షి టీమ్ కి చెందింది అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ సార్, ఈ సినిమా పై మీకున్న నమ్మకం కోసం అంటూ వంశీ ట్వీట్ చేశారు. మహర్షి చిత్రం అవార్డ్ అందుకోవడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular