బిగ్ బాస్ సీజన్ 5లో ఈ యాంకర్!?

ప్రతి బిగ్ బాస్ సీజన్ లో తెలుగులోనే నంబర్ 1 న్యూస్ చానెల్ అయిన టీవీ9 నుంచి ఒక లేడి న్యూస్ యాంకర్ ఖచ్చితంగా పాల్గొంటున్నారు. పోయిన సారి దీప్తి, మొన్నటి సారి దేవి అంతకుముందు టీవీ9 జాఫర్ ఇలా బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఒకరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ సంప్రదాయాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి. తాజాగా బిగ్ బాస్ 5కు సంబంధించిన ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇందులో ఎవరెవరు పాల్గొంటారనే దానిపై ఆసక్తి […]

Written By: NARESH, Updated On : March 16, 2021 7:57 pm
Follow us on

ప్రతి బిగ్ బాస్ సీజన్ లో తెలుగులోనే నంబర్ 1 న్యూస్ చానెల్ అయిన టీవీ9 నుంచి ఒక లేడి న్యూస్ యాంకర్ ఖచ్చితంగా పాల్గొంటున్నారు. పోయిన సారి దీప్తి, మొన్నటి సారి దేవి అంతకుముందు టీవీ9 జాఫర్ ఇలా బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఒకరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ సంప్రదాయాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారని చెప్పాలి.

తాజాగా బిగ్ బాస్ 5కు సంబంధించిన ఆడిషన్స్ మొదలయ్యాయి. ఇందులో ఎవరెవరు పాల్గొంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా టీవీ 9 నుండి ఒక యాంకర్ ను ఎంపిక చేశారని సమాచారం. సీజన్ 2లో దీప్తి నల్లోమోతు టీవీ9 నుంచి పాల్గొన్నారు. సీజన్ 3 మరియు 4 సీజన్లలో జాఫర్ మరియు దేవి నాగవల్లి వరుసగా బిగ్ బాస్ లో మెరిశారు. ఇప్పుడు టీవీ 9 నుండి మరో యాంకర్ ప్రత్యూష బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టబోతోందని టాక్. ఆమె నమ్మశక్యం కాని ఆఫర్ ఇచ్చారని.. ఈ రోజు యాంకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక బిగ్ బాస్ బరిలో ఈ సారి హేమాహేమీలు బరిలోకి దిగబోతున్నారట.. యాంకర్ రవి, యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జశ్వంత్, హెచ్‌ఎంటీవీ యాంకర్ రోజా, టిక్‌టాక్ స్టార్ మహాతల్లి తదితరులు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. మరి ఇందులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.