Rajamouli: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ మూవీలో తారక్ కొమరం భీమ్గా కనిపించనుండగా… చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. కాగా నిన్న ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్కు చేరుకుని… ప్రభంజనం సృష్టించింది.
ముంబయిలో ఇటీవలే మీడియాతో ముచ్చటించిన రాజమౌళి అండ్ టీమ్.. తాజాగా హైదరాబాద్లోనూ మీడియాతో సమావేశమయ్యారు. ఇందులో రామ్చరణ్, తారక్ కూాడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాలో తారక్, రామ్చరణ్ పాత్రలతో పాటు అజవ్ దేవగణ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పి పంచులు వేశారు రాజమౌళి.
ఇందులో అజయ్ దేవగణ్ పాత్ర ఎలా ఉంటుంది.. తారక్ ముస్లిం గానే కనిపిస్తారా అని అడగ్గా… నేను ట్రైలర్లోనే చెప్పాల్సిందందా చెప్పేశా.. చాలా క్లియర్గా చూపించా.. కానీ ఇంకా మీరు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇది చూస్తుంటే స్క్రిప్ట్ మొత్తం మీకు చూపించమని అడుగుతున్నట్లు అంది అని నవ్వుతూ సరదాగా అన్నారు. దీంతో సమావేశం మొత్తం నవ్వులు పూశాయి. దీంతో పాటు ఈ సినిమా మొత్తం పూర్తి కల్పితమని.. కేవలం భీమ్, రామ్ వ్యక్తిత్వాలను చూపించేందుకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. హిస్టరీ చూపించడం తమ ఉద్దేశం కాదని అన్నారు రాజమౌళి.