Malvi Malhotra: మాల్వి మల్హోత్రా ఆ ప్రొడ్యూసర్ ని ఛీట్ చేసిందా… రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు, హీరోయిన్ పై మరో కేసు నమోదు!

రాజ్ తరుణ్ నేను చాలా కాలంగా సహజీవనం చేస్తున్నాము. మా ఇద్దరికి గుడిలో రహస్య వివాహం కూడా జరిగింది. రెండుసార్లు నాకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు. మూడు నెలల క్రితం రాజ్ తరుణ్ నా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఇక నన్ను వదిలేయ్ అంటున్నాడు. లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆమె చెప్పినట్లు రాజ్ తరుణ్ వింటున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Written By: S Reddy, Updated On : July 16, 2024 7:55 am

Malvi Malhotra

Follow us on

Malvi Malhotra: హీరోయిన్ మాల్వి మల్హోత్రా మీద మరో కేసు నమోదు అయ్యింది. నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ తల్లి మాల్వి మల్హోత్రా మీద ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మాల్వి తన కొడుకును ట్రాప్ చేసింది. ఆస్తులు లాక్కుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజా పరిణామం చర్చకు దారి తీసింది. మాల్వి మల్హోత్రా ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. లావణ్య అనే యువతి ఆమె మీద కేసు పెట్టింది. హీరో రాజ్ తరుణ్ తో 10 ఏళ్లకు పైగా సహజీవనం చేస్తున్న లావణ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించింది.

Also Read: శంకర్ ప్లాప్ ల పరంపర ను అపాలంటే రామ్ చరణ్ ఒక్కడే దిక్కు అంటున్న ట్రేడ్ పండితులు…ఎందుకో తెలుసా..?

రాజ్ తరుణ్ నేను చాలా కాలంగా సహజీవనం చేస్తున్నాము. మా ఇద్దరికి గుడిలో రహస్య వివాహం కూడా జరిగింది. రెండుసార్లు నాకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు. మూడు నెలల క్రితం రాజ్ తరుణ్ నా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఇక నన్ను వదిలేయ్ అంటున్నాడు. లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆమె చెప్పినట్లు రాజ్ తరుణ్ వింటున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

420, 493, 506 సెక్షన్స్ క్రింద రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్ర,ఆమె బ్రదర్ మయాంక్ మల్హోత్రా మీద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ ఏ1 కాగా, మాల్వి, మయాంక్ ఏ2, ఏ3గా ఉన్నారు. ఈ వివాదం నడుస్తుండగా మరో కేసు మాల్వి మల్హోత్రా మీద ఫైల్ అయ్యింది. నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ తల్లి ఈ కేసు పెట్టింది. తన కొడుకును మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో మోసం చేసింది. మా ఆస్తులు కాజేసింది. అతన్ని జైలుపాలు చేసింది. గత నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేస్తుందని.. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

2020లో మాల్వి మల్హోత్రా మీద యోగేష్ మహిపాల్ సింగ్ దాడికి పాల్పడ్డాడు. మాల్వి మల్హోత్రాను కత్తితో ఆయన పొడిచినట్లు సమాచారం. గాయాలపాలైన మాల్వి మల్హోత్రా చికిత్స అనంతరం కోలుకున్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసులో యోగేష్ మహిపాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాడు. తాజాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ తల్లి కేసు పెట్టడం చర్చకు దారి తీసింది. ఇక యోగేష్, మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలు, వీడియో కాల్ రికార్డ్స్ ఆమె బయటపెట్టారు.

గతంలో మాల్వి మల్హోత్రా యోగేష్ మహిపాల్ సింగ్ తో ఎఫైర్ నడిపినట్లు తెస్తుంది. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. యోగేష్ మహిపాల్ సింగ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. యోగేష్ కి బెయిల్ ఇవ్వకూడదన్న మాల్వి మల్హోత్రా.. అతనికి జీవిత ఖైదు పడాలని కోరుకుంది. ఇలాంటి మనుషులు సమాజంలో తిరగకూడదంటూ విమర్శలు చేసింది. తాజాగా యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రా పై కేసు పెట్టడంతో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చూస్తుంటే మాల్వి మల్హోత్రా పలు వివాదాల్లో ఉన్నారనిపిస్తుంది.

రాజ్ తరుణ్ కి జంటగా మాల్వి మల్హోత్రా తిరగబడర సామీ అనే మూవీ చేస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీ సెట్స్ లోనే రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా దగ్గరయ్యారనేది లావణ్య ఆరోపణ. కాగా మాల్వి మల్హోత్ర-లావణ్య మధ్య ఫోన్ కాల్స్ చోటు చేసుకున్నాయి. ఇద్దరు వాగ్వాదానికి దిగారు. రాజ్ తరుణ్ ని వదిలేయాలని మాల్వి మల్హోత్రాను లావణ్య కోరడం ఆ ఆడియో కాల్ రికార్డ్స్ లో ఉంది.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో టెంప్ట్ అయిన జంట.. లైంగిక వాంఛ తీర్చుకుంటూ కెమెరా కంటికి చిక్కిన కంటెస్టెంట్స్, వీడియో వైరల్