ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే !

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ రోజు ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. దర్శకుడు రాజమౌళి, కేజీఎఫ్ స్టార్ యష్ ఈ లాంఛింగ్ కు ప్రత్యేక అతిథులుగా హాజరుకాబోతున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది సినీ-రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు. ఈ తరుణంలో […]

Written By: admin, Updated On : January 15, 2021 11:59 am
Follow us on


నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ రోజు ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. దర్శకుడు రాజమౌళి, కేజీఎఫ్ స్టార్ యష్ ఈ లాంఛింగ్ కు ప్రత్యేక అతిథులుగా హాజరుకాబోతున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది సినీ-రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది మంచి కిక్ ఇచ్చే వార్తే. అయితే ఈ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: గిల్డ్ పెద్దలూ.. ఈ లోపు సినిమా చచ్చిపోతుంది ?

ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఫిబ్రవరి 8 నుండి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో షూట్ స్టార్ట్ చేస్తారట. దీనితో ప్రభాస్ మిగిలిన సినిమాల రిలీజ్ ప్లానింగ్ మొత్తం మారిపోయేలా ఉంది. పైగా ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి, మిగిలిన సినిమాలను కూడా పోస్ట్ ఫోన్ చేసుకోవాలి. అలా చేస్తే.. ఆల్ రెడీ ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. కానీ, ప్రభాస్ సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.

Also Read: హానీమూన్ కోసం మంచి ప్లేస్‌ కి వెళ్తాం – సునీత

మరోపక్క ప్రభాస్ ఓం రౌత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” సినిమాను చేస్తున్నాడు. నిజానికి ఈ రెండు సినిమాల కన్నా ముందు “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీని ముందు ఎనౌన్స్ చేశాడు ప్రభాస్. కాకపోతే ఈ సినిమా ఇప్పట్లో ఉండేలా లేదు. పైగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, దీపికా కూడా కీలక పాత్రలు చేస్తున్నారు కాబట్టి.. వాళ్ళ డేట్స్ కూడా అన్ని చూసుకోవాలి. అందుకే ప్రభాస్ ముందుగా “సలార్” మొదలుపెట్టి 2021లో పూర్తీ చేయాలని చూస్తున్నాడు. అన్నట్టు ఈ మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఈ స్టార్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా, త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ అధికారకంగా ప్రకటిస్తారని కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్