Radhe shyam: యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శత్వంలో పీరియాడిక్ లవ్ స్టారీ ఈ సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. పూడా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది. అయితే, తాజాగా, ఈ సినిమా క్లైమాక్స్పై పలు ఆసక్తికర విషయాలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సినిమా మొత్తానికి ఒక్క చివరి సీన్కే నిర్మాతలు 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, దాదాపు 15 నిమిషాలు నిడివితో క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రేక్షకుల మనసును కదిలించే విధంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్.
మరోవైపు అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆసక్తి పెంచుకున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఉదయం 11:16 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్లో ఉండే ఈ టీజర్తో పాటు అన్ని భాషల సబ్టైటిల్స్ రానున్నాయి. ‘హూ ఈజ్ విక్రమాదిత్య’ అనే క్యాప్షన్తో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.
1970ల నాటి వింటేజ్ ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ సినిమా తీశారు. జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.’బాహుబలి’తో ఎన్నో రికార్డులు సాధించిన ప్రభాస్.. ఈ సినిమాతో ఇంకెన్ని ఘనతలు సాధిస్తారో చూడాలి.