అయినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కి తామూ భయపడేది లేదంటున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఆ మాటకొస్తే ఈ ఏడాది కరోనా ప్రవాహం కొనసాగుతున్న రోజుల్లోనే ‘జాంబీ రెడ్డి’ అంటూ థియేటర్స్ లోకి వచ్చి.. విజయం అందుకున్న ఈ కుర్రాడు, ఇప్పుడు ‘ఇష్క్’ అనే మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాడు. పైగా అది థియేటర్స్ ద్వారా. మరి ఈ కుర్రాడి సినిమా కోసం జనం థియేటర్స్ వరకూ వెళ్తారా ?
అయితే ఈ సినిమా విషయంలో కాస్త అంచనాలు కనిపిస్తోన్న మరో అంశం ఏమిటంటే.. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత తేజ సజ్జాతో ఈ ‘ఇష్క్ చిత్రాన్ని నిర్మించింది. పైగా ఈ సినిమాలో సెన్సేషన్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సగర్వంగా ప్రకటించారు.