Tollywood: తెలుగు పరిశ్రమలో పేరు సంపాదించి ఆ ఇండస్ట్రీనే తిట్టిన తారలు…

ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హీరోయిన్ ఇలియానా. దేవదాసు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

Written By: Suresh, Updated On : September 26, 2023 2:34 pm

Tollywood

Follow us on

Tollywood: ఓడలో ఉన్నంత వరకు ఓడ మల్లన్న, ఓడలోంచి దిగిన తర్వాత బోడ మల్లన్న ఇదే కొందరి తెలుగు సినిమా హీరోయిన్స్ తీరులా మారింది ప్రస్తుతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు ఉన్నంత వరకు సైలెంట్ గా ఉండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. క్రేజ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసారు చాలా మంది హీరోయిన్స్. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయంటే కొంత మంది హీరోయిన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పై నోరు పారేసుకోవడం అలవాటు చేసుకుంటారు. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సౌత్ ఇండియా పరిశ్రమను సైతం చిన్న చూపు చూస్తారు. బాలీవుడ్ లో వారికి పరమావధిగా కనిపిస్తే.. తర్వాత అవకాశాలు ఉన్నా లేకున్నా వారికి తెలుగు భాష పెద్దగా నచ్చదు. ఇలా తెలుగు ఇండస్ట్రీని తిట్టిన తారలు ఎవరో ఒకసారి లిస్ట్ చూద్దాం.

ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హీరోయిన్ ఇలియానా. దేవదాసు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఆ తర్వాత దర్శకులు అంతా తన నడుము పై నెగటివ్ కామెంట్స్ చేసేవారు అని చెప్తుంది ఇలియానా. నీ నడుం పైన ఏదో ఉందంటూ.. ముట్టుకోవాలనిపిస్తుందంటూ తెలిపింది. నడుము అందంగా ఉందని ఎప్పుడు కామెంట్స్ చేసి వేధించేవారు అని చెప్పుకొచ్చింది. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పకుండా బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాకే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని చాలా మంది విమర్శించారు.

అటు రష్మిక సైతం సౌత్ ఇండియా గురించి పిచ్చిగా కామెంట్స్ చేసి వారి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఆమె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మహా క్రేజ్ ఉంది. దీంతో సౌత్ ఇండియా పరిశ్రమను చిన్న చూపు చూస్తోంది అంటున్నారు సౌత్ పరిశ్రమ అభిమానులు. ఇక అవకాశాల కోసం నానా కష్టాలు పడుతున్న రాశి కన్నా సైతం సౌత్ దర్శకులు కేవలం బొద్దుగా ఉన్న హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తారంటూ బాంబ్ పేల్చింది. అలాగే ఒక వర్గం హీరోయిన్స్ కి అసలు అవకాశాలే ఇవ్వట్లేదు అని అంటుంది ఈ అమ్మడు. ఇక పూర్తిగా తెలుగులో కనుమరుగైన రకుల్ ప్రీత్ సైతం తెలుగు సినిమా దర్శకుల పై నోరు పారేసుకుంది. పాన్ ఇండియా సినిమాల్లో ఒక వర్గం హీరోయిన్స్ ని ఎంచుకోవడం లేదని.. అసలు అవకాశాలే ఇవ్వడం లేదంటూ తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే వీరంతా సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన వారే. వీరే కాదు మరికొంత మంది హీరోయిన్స్ సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లగానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.

అయితే వారు ఎదుర్కొన్న సమస్యలను చెప్పినా సైతం అసలు ఇండస్ట్రీలో ఉండగా అవకాశాల కోసం ఒదిగి ఉండి అవసరం తీరిన వెంటనే ఇలాంటి కామెంట్స్ చేయడం తగునా అని కొందరి వాదన. అయితే నెగటివ్ కామెంట్స్ చేస్తే ఉన్న అవకాశాలు కూడా పోతాయేమో అనే భయంతో మాట్లాడకుండా ఉన్నారని వీరి అభిమానులు వాదన. ఈ హీరోయిన్స్ లో చాలా మంది ఇప్పుడు బాలీవుడ్ లో తలుక్కుమంటున్నారు. రష్మిక మందన్నా పుష్ప సినిమా క్రేజ్ తో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించింది. కానీ తన కన్నతల్లి లాంటి కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికి చాలా విమర్శలను ఎదుర్కొంటోంది. కాంతారా సినిమా గురించి రష్మిక చేసిన కామెంట్స్ ఆమెకు సమస్యను తెచ్చిపెట్టాయి. ఆమె అభిమానులు సైతం విమర్శించేవిధంగా మారింది రష్మిక.