సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు మరో సినిమాతో మన ముందుకొచ్చాడు. ఈసారి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అంటూ ఒక కులాల మధ్య నలిగిపోయి విడిపోయే ప్రేమ కథతో వచ్చేశాడు. సుధీర్ బాబు హీరోగా.. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించగా 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజ్అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ ఈ టీజర్ బాగుందని.. తెగ ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. సినిమాల్లో రిలీజ్ అయితే చూడాలని ఉందని అన్నాడు. సుధీర్ బాబు ఇందులో చాలా బాగా నటించాడని పేర్కొన్నాడు.
Here's the trailer of #SrideviSodaCenter Absolutely enjoyed it! Looking forward to its release in the cinemas. Good luck to @isudheerbabu and the entire team!https://t.co/Ykox3cYwIf@anandhiactress @70mmEntertains @Karunafilmmaker #ManiSharma
— Mahesh Babu (@urstrulyMahesh) August 19, 2021
ఇక ట్రైలర్ చూస్తే.. ‘సోడాలు అమ్ముకునే అందమైన శ్రీదేవిని చూసి మనసు పడుతాడు లైటింగ్ పనులు చేసే సూరిబాబు.. ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ కులాలు వేరుకావడంతో శ్రీదేవి తండ్రి ఒప్పుకోడు. వారి కులపోళ్లు ఒప్పుకోరు. చివరకు ఆ కులం అంతా ఏకమై సుధీర్ ను జైల్లో పెడుతారు. జైలు నుంచి బయటకొచ్చాక సుధీర్ బాబు తన ప్రేమను, తన ప్రత్యర్థులపై పగను ఎలా సాధించాడు? ఎలా కర్కశంగా మారాడన్నది ట్రైలర్ లో చూపించారు.
యాక్షన్, ఎమోషనల్, రోమాంటిక్ సీన్లలో సుధీర్ బాబు నటన ఆకట్టుకుంది. మునుపటి కంటే కూడా బాగా నటించాడు. ఆనంది అందచందాలు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.కొత్త విలన్ నటన కూడా బాగుంది.ఆగస్టు 27న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.