Sri reddy on Mahesh Babu: మ‌హేష్ బాబుపై శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టు.. సోష‌ల్ మీడియాలో అభిమానుల ర‌చ్చ‌!

Sri reddy on Mahesh Babu: కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన శ్రీరెడ్డి.. అప్ప‌టి నుంచి ర‌చ్చ చేస్తూనే ఉంది. త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫొటోల‌ను షేర్‌చేస్తూ.. కుర్ర‌కారును వేడెక్కిస్తూ ఉంటుంది. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాల‌పై, న‌చ్చ‌ని మ‌నుషుల‌పై డైరెక్ట్ గా అటాక్ చేసే శ్రీరెడ్డి.. త‌న అందాల‌ను కూడా డైరెక్ట్ గా ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటుంది. అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌కు సైతం ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌దు ఈ సుంద‌రి. సోష‌ల్ మీడియాతోపాటు ఇంట‌ర్వ్యూల్లోనూ […]

Written By: Bhaskar, Updated On : September 19, 2021 3:35 pm
Follow us on

Sri reddy on Mahesh Babu: కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన శ్రీరెడ్డి.. అప్ప‌టి నుంచి ర‌చ్చ చేస్తూనే ఉంది. త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫొటోల‌ను షేర్‌చేస్తూ.. కుర్ర‌కారును వేడెక్కిస్తూ ఉంటుంది. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాల‌పై, న‌చ్చ‌ని మ‌నుషుల‌పై డైరెక్ట్ గా అటాక్ చేసే శ్రీరెడ్డి.. త‌న అందాల‌ను కూడా డైరెక్ట్ గా ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటుంది. అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌కు సైతం ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌దు ఈ సుంద‌రి. సోష‌ల్ మీడియాతోపాటు ఇంట‌ర్వ్యూల్లోనూ బోల్డ్ గా మాట్లాడేస్తూ.. త‌న‌కు ఎదురే లేద‌న్న‌ట్టుగా సాగిపోతూ ఉంటుంది. తాజాగా.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు(Mahesh Babu)పై పోస్టు పెట్టి ర‌చ్చ‌కు తెర‌తీసింది.

చాలా కాలంగా.. హైద‌రాబాద్ ను వ‌దిలి చెన్నైలో ఉంటోంది శ్రీరెడ్డి. అయితే.. తరచూ సోషల్ మీడియాలో పర్సనల్, కెరీర్ కు సంబంధించిన అప్డేట్లు వదిలే ఈ అమ్మ‌డు.. కొంత కాలంగా సైలెంట్ అయిపోయింది. దీనికి కార‌ణం క‌రోనా కావొచ్చ‌ని చాలా మంది భావించారు. అయితే.. రీజ‌న్ అది కాద‌ని స్వయంగా చెప్పింది శ్రీరెడ్డి. తాను డిప్రెష‌న్లో ఉండిపోయాన‌ని, అది ఎక్కువ‌య్యే స‌రికి డాక్ట‌ర్ ను కూడా సంప్ర‌దించాల్సి వ‌చ్చిందని తెలిపింది. అందువ‌ల్లే ఇన్నాళ్లూ సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్న‌ట్టు చెప్పింది.

ఇక, ప‌వ‌న్ (Pawan Kalyan) పేరు చెబితే అంతెత్తున లేచే శ్రీరెడ్డి.. పాజిటివ్ గా మాట్లాడి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. వ‌ర్క్‌, ప్రొఫెష‌న‌లిజంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్వాలేద‌ని చెప్పింది. అయితే.. రాజ‌కీయాలు ఆయ‌న‌కు సూట్ కావ‌నేది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని తెలిపింది. అదే స‌మ‌యంలో.. భ‌విష్య‌త్ లో ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని వ్యాఖ్యానించింది. మార్పు అనేది భ‌విష్య‌త్ లో రావొచ్చేమో.. అదే జ‌రిగితే మా జ‌గ‌న్ కు మంచి పోటీదారు ప‌వ‌న్‌ కావాల‌ని ఆశిస్తున్న‌ట్టు చెప్పింది శ్రీరెడ్డి.

ప‌వ‌న్ పై కామెంట్స్ త‌ర్వాత మ‌ళ్లీ మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. ఇప్పుడు లేటెస్ట్ గా మ‌హేష్ బాబుపై పోస్టు పెట్టింది. తాజాగా సైమా అవార్డ్స్ కు మ‌హేష్‌ హాజ‌రైన ఫొటో పెట్టి ‘‘ సిమ్లా యాపిల్ లా ఉన్నాడు బాబు’’ అంటూ లవ్ ఎమోజీ కూడా పెట్టింది. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. మహేష్ అభిమానులు శ్రీరెడ్డిపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి.. మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మొద‌లు పెట్టింది శ్రీరెడ్డి.