Shruti Haasan: ఎద అందాలు చూపిస్తూ బాయ్ ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన శృతిహాసన్.. ఫొటోలు వైరల్

మైఖేల్ కోర్సే అనే వ్యక్తితో ఓపెన్ గా ఎఫైర్ నడిపింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి మధ్య ఘాడమైన ప్రేమ బంధం ఏర్పడింది. మైఖేల్ ని కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసింది. అతనితో శ్రుతికి పెళ్లి ఖాయం అంటూ వార్తలొచ్చాయి.

Written By: NARESH, Updated On : November 3, 2023 12:56 pm

Shruti Haasan

Follow us on

Shruti Haasan: శృతి హాసన్ చాలా ఓపెన్ మైండెడ్. ఆమెది పాశ్చాత్య ధోరణి. ఎఫైర్స్, రిలేషన్స్ పెద్ద మేటర్ కాదనుకుంటుంది. సాధారణంగా సెలెబ్స్ తమ లవ్ ఇంట్రెస్ట్స్ గురించి బయిటకు తెలియకూడదని భావిస్తారు. పుకార్లు వస్తున్నా నోరు మెదపరు. రిలేషన్ లో ఉండటం ఏదో అపరాధంగా, చెప్పుకోలేని విషయంగా భావిస్తారు. శృతి అలా కాదు. తన జీవితం తెరిచిన పుస్తకం అంటుంది. కెరీర్ బిగినింగ్ నుండి శృతి ఒకరిద్దరు హీరోలతో ఎఫైర్ నడిపారనే పుకార్లు ఉన్నాయి.

అయితే మైఖేల్ కోర్సే అనే వ్యక్తితో ఓపెన్ గా ఎఫైర్ నడిపింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి మధ్య ఘాడమైన ప్రేమ బంధం ఏర్పడింది. మైఖేల్ ని కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసింది. అతనితో శ్రుతికి పెళ్లి ఖాయం అంటూ వార్తలొచ్చాయి. అనూహ్యంగా 2019లో మైఖేల్-శృతి బ్రేకప్ చెప్పుకున్నారు. ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి మరొక ప్రియుడిని వెతుక్కుంది.

ప్రస్తుతం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో సహజీవనం చేస్తుంది. కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. అతనితో గడిపే ప్రతి మూమెంట్ ని శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా శాంతనుతో కలిసి ఓ ఫోటో షూట్ చేసింది. ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో శృతి మెస్మరైజ్ చేసింది. శృతి హాసన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

ఇక శృతి కెరీర్ చూస్తే… ఆమె కమ్ బ్యాక్ అయ్యింది. ఈ ఏడాది ఆమె సంక్రాంతి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి ఓ మోస్తరు విజయం అందుకుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య మాత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సలార్ వంటి భారీ పాన్ ఇండియా మూవీ ఆమె ఖాతాలో ఉంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. సలార్ 2 కూడా ఉందని సమాచారం…