Shobha Shetty: డబ్బుల కోసం సీరియల్స్ మానేసి ఆ పని చేస్తున్న శోభా శెట్టి… వీడియో వైరల్

శోభా ప్రియుడు యశ్వంత్ రెడ్డితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. మరో వైపు కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు అమలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంది.ఇటీవల శోభా యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే.

Written By: S Reddy, Updated On : March 2, 2024 10:49 am
Follow us on

Shobha Shetty: బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి యాక్టింగ్ కి గుడ్ బాయ్ చెప్పేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. సీరియల్స్ వలన పెద్దగా డబ్బు రావడం లేదని అనుకుందేమో, మొత్తానికే రూట్ మార్చేసింది. హౌస్ నుండి బయటకు వచ్చాక ఒక్క సీరియల్ కూడా శోభా ఒప్పుకోలేదు. పైగా యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది. ఇప్పుడు మరో వ్యాపారం మొదలు పెట్టే ఆలోచనలో ఉంది. బిగ్ బాస్ సీజన్ 7లో అత్యంత నెగిటివిటీ తెచ్చుకున్న వాళ్లలో శోభా మొదటి స్థానంలో ఉంటుంది. తన ప్రవర్తనతో ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది.

ఇక బయటకు వచ్చాక శోభా ప్రియుడు యశ్వంత్ రెడ్డితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. మరో వైపు కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు అమలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంది.ఇటీవల శోభా యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే. సుమన్ టీవిలో కాఫీ విత్ శోభా అనే ప్రోగ్రాం చేస్తుంది. అలాగే ఓ మేకప్ స్టూడియో ప్రారంభించింది. శోభా మేకప్ ఆర్టిస్ట్ కావడంతో ఆసక్తి ఉన్నవారికి మేకప్ కోర్స్ నేర్పిస్తూ డబ్బులు సంపాదించాలని భావిస్తుంది.

తాజాగా గా ప్రియుడితో కలిసి సూరత్ వెళ్ళింది. అక్కడ నుంచి హోల్ సేల్ కి చీరలు కొని తెచ్చింది. అయితే ఆ చీరలు తన మేకప్ స్కూల్ కి వచ్చే వారికి అమ్మాలని అనుకుంటుందట. ఇలా బిజినెస్ పైనే దృష్టి పెడుతూ యాక్టింగ్ కి కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కార్తీకదీపం పార్ట్ 1 లో మోనిత గా విలన్ రోల్ లో శోభా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పార్ట్ 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

విడుదలైన ప్రోమో లో డాక్టర్ బాబు, వంటలక్క మాత్రమే కనిపించారు. మిగిలిన పాత్రల గురించి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కార్తీకదీపం 2లో మోనిత ఉంటుందా లేదా అని ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో శోభా శెట్టి కి ఛాన్స్ దక్కలేదట. నవ వసంతం లో మోనిత క్యారెక్టర్ లేదని సమాచారం. ఇప్పటివరకు ఆమె ప్రస్తావన రాలేదు. ఇక సీరియల్ మధ్యలో మోనిత పాత్ర యాడ్ చేస్తారేమో చూడాలి మరి.