Shayam Singaroy: నాని ప్రస్తుతం ” శ్యామ్ సింగరాయ్ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఎమోషనల్, కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన త్వరలోనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసేకుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా లోని రెండో పాట “ఏదో ఏదో” ను నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సాంగ్ లో కృతి శెట్టి తో నాని స్టెప్పులేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్గా హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడుపోయాయి. బీ 4 ఛానెల్ రూ. 10 కోట్లకు ‘శ్యామ్ సింగ రాయ్’ హిందీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 24న తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ గ్రాండ్గా రిలీజ్ కానుంది.
25th Nov🎵#EdoEdo 💞
Second Single pic.twitter.com/1OZoUNeeKW— Nani (@NameisNani) November 22, 2021
చాలా కాలంగా సాలిడ్ హిట్కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ సినిమా బ్రేక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.