Satluj OTT Removal: ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రిలీజ్ అయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఏదైనా వివాదంలో చిక్కుకున్న సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించినప్పటికి ఆ వివాదం వల్ల ఆ సినిమా చాలా వరకు నష్ట పోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నటుడు దిల్జిత్ నటించిన ‘సట్లూజ్’ అనే మూవీ ఈనెల 3 వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన జీ5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది…
ఇక స్ట్రీమింగ్ కి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ సినిమాని జీ5 వాళ్ళు తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా ని ఓటిటి సంస్థ తొలగించాలి అనుకుంది అది చాలా సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా వాళ్లకు ఓటిటి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటారు. కాబట్టి అర్ధాంతరంగా ఆ సినిమాని ఆ ప్లాట్ ఫామ్ నుంచి తీసివేయడం వల్ల అటు సినిమా వాళ్లకి ఇటు ఓటిటి సంస్థకి కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశమైతే ఉంది.
ఇక దానిని ఎందుకని ఓటిటి నుంచి తొలగించారనే విషయం పర్ఫెక్ట్ గా చెప్పలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ సినిమాని ఇండియాలో స్ట్రీమింగ్ చేయడం కష్టతరం అంటూ జీ5 వాళ్ళు ఒక క్లారిటి అయితే ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే పంజాబ్ లో జరిగిన హత్యల పేరిట 2022 లో ‘పంజాబ్ 95’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి 127 కట్లను విధించడంతో చేసేది ఏమీ లేక సినిమా పేరుని మార్చి ఓటిటి లో రిలీజ్ చేశారు.
ఇక ఇక్కడ కూడా కాంట్రవర్సీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఓటిటి సంస్థ ఈ సినిమాని తొలగించడం జరిగింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల వాళ్లకి భారీ నష్టమైతే వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. అందుకే సినిమా చేసేటప్పుడు కాంట్రవర్సీ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సినిమాని తెరకెక్కించగలిగితే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం క్లారిటి ఇస్తున్నారు…

