Samantha Emotional Comments: కొంతకాలం గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా భారీ రేంజ్ లో వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ఇంతమంది ఓపెనింగ్స్ రావడానికి సమంత బ్రాండ్ ఇమేజ్, ప్రమోషనల్ కంటెంట్ తో పాటు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. విడుదలకు ముందు ఆమె ఆ రేంజ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక్క రోజులో ఆమె దాదాపుగా 40 కి పైగా ఇంటర్వ్యూస్ ఇచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ప్రొమోషన్స్ కోసం ఆమె ఎంత కష్టపడింది అనేది చెప్పడానికి. అయితే ఒక ఇంటర్వ్యూ లో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన కొన్ని మాటలు అభిమానులను em అయ్యేలా చేసింది .
ఆమె మాట్లాడుతూ ‘నేను అనారోగ్యంగా ఉన్న రోజుల్లో , ప్రతీ రోజు ఒకే రకమైన ఆహరం తీసుకునేదాన్ని. ఆ కారణం చేత నేను చాలా చిక్కిపోయాను. అందరూ నన్ను ఏంటి ఇంత చిక్కిపోయావు?, అసలు ఆహరం తీసుకుంటున్నావా అని అడిగేవారు. కానీ వాస్తవానికి ఆ సమయం లో నాకు ఆహరం తీసుకొని స్థితిలో ఉన్నాను, ఏ ఫుడ్ తీసుకున్నా నా కడుపుకి పడేది కాదు. మయోసిటిస్ తిరగబడేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు డాక్టర్లు షుగర్ , డైరీ లేని ఐస్ క్రీం తినేందుకు డాక్టర్లు అనుమతిని ఇచ్చారు. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడింది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మయోసిటిస్ సోకినప్పుడు సమంత నిజంగా నరకాన్ని ప్రత్యక్షంగా చూసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక మహిళ అయ్యుండి అంతటి నరకాన్ని భరించి, ధైర్యం దాంతో పోరాడి , నేడు ఈ స్థాయిలో నిలబడడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. ప్రతీ మహిళ కూడా సమంత ని ఆదర్శంగా తీసుకోవాలి , కష్టాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకూడదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తూ , సమంత ని పొగడ్తల వర్షం లో ముంచెత్తారు. అలాంటి కష్టసమయం లో తనకు తన స్నేహితులు , రాజ్ నిడిమోరు వంటి వారు బలంగా వెన్నుముక లాగా నిలబడడం కూడా సమంత కోలుకునేందుకు దోహదపడింది అంటున్నారు నెటిజెన్స్.
