Sai Dharam Tej: మెగాస్టార్ మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే ఓ బైక్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్స్ దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డారు సాయిధరమ్. దీంతో తేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి.. పెను ప్రమాదం నుంచి తప్పించారు. నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్.. ఇటీవలే దీపావళి రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు.

అయితే, షూటింగ్ పరంగా ఇంకా కాస్త తన శరీరం సహకరించే విధంగా లేదని తెలుస్తోంది. ఇంకొద్ది రోజులు సాయి తేజ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని.. మళ్లీ గతంలో లాగ ఫుల్ యాక్టీవ్ అయ్యాగే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకోసం తన బాడీని ట్రైన్ చేయడం కూడా మొదలుపెట్టాశాడట. మంచి ఆహారంతోపాటు, జిమ్, యోగా చేయడం లాంటివి కూాడా చేస్తున్నాడట.
చిరు మేనల్లుడిగా వెండితెరపై అడుగుపెట్టి.. పిల్లా నువ్వులేని జివితం సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన రిపబ్లిక్ సినిమాకు బాస్కాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. అయితే, కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో రాబట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమాకు దేవకట్ట దర్శకత్వం వహించారు. కాగా, ఈ గ్యాప్లో వరుసగా కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మారుతితో పాటు మరో కొత్త దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం. మారుతి సినిమాను జనవరిలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇలా కొత్త సంవత్సరాన్ని కొత్త సినిమా అనౌన్స్మెంట్లతో స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.