
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లాక్డౌన్లో మూవీని ప్లాన్ చేశాడు. సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ తొలుగునాట మరో సంచలనాన్ని సృష్టించబోతున్నాడు. లాక్డౌన్ కారణంగా రెండునెలలుగా థియేటర్లు మూతపడగా, సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సెలబ్రెటీలంతా సోషల్ మీడియాకే పరిమితంకాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఈనెల మొదట్లోనే సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ లిమిటెడ్ మెంబర్స్ తో ఓ చిన్న ఫీచర్ ఫిల్మ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
లాక్డౌన్లో పూర్తిచేసిన తొలి చిత్రంగా వర్మ ఫీచర్ ఫిల్మ్ రికార్డు సృష్టించబోతుంది. వర్మ శిష్యుడు ఆగస్త్య ముంజు ఈ ఫీచర్ ఫిల్మ్ కు దర్శకత్వంగా వహించగా రాంగోపాల్ వర్మ పర్యవేక్షించినట్లు సమాచారం. తక్కువ బడ్జెట్లో ఈ మూవీని ఒకే లోకేషన్లో, అతికొద్ది మందితో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వర్మ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా వర్మ అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గతంలో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ మూవీకి లాక్డౌన్లో పోస్టు ప్రొడక్షన్ పనులు చేశారు. ‘క్లైమాక్స్’ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లను లాక్డౌన్లోనే విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ మూవీని ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్ యాప్ లో ఈనెల 29న విడుదల రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇకపై కూడా కరోనాకు దొరక్కుండా మరిన్ని ఫిల్మ్ తీసేందుకు వర్మ ప్లాన్ చేస్తుండటం విశేషం. అయితే పెద్ద సినిమాల షూటింగులపై ఇంకా క్లారిటీ రాలేదు. లాక్డౌన్ 4.0ముగిశాకైనా దీనిపై క్లారిటీ వస్తుందో? లేదో చూడాలి..!