Ranbir Kapoor: ఫ్లోలో రష్మిక-విజయ్ దేవరకొండ ఎఫైర్ లీక్ చేసిన రన్బీర్… మొదటిసారి ఇంటి మేడపైన కలిశారంటూ!

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య ఎఫైర్ నడుస్తుందనే వాదన ఉంది. బాలీవుడ్ మీడియా దీన్ని ప్రముఖంగా రాసింది. లైగర్ మూవీ సమయంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలో ఉన్నారు.

Written By: NARESH, Updated On : November 24, 2023 6:35 pm

Ranbir Kapoor

Follow us on

Ranbir Kapoor: విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య ఎఫైర్ నడుస్తుందనే వాదన ఉంది. బాలీవుడ్ మీడియా దీన్ని ప్రముఖంగా రాసింది. లైగర్ మూవీ సమయంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలో ఉన్నారు. అప్పుడు ముంబై వీధుల్లో రష్మిక, విజయ్ తరచుగా కనిపించారు. డిన్నర్ నైట్స్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. అలాగే రెండు పర్యాయాలు జంటగా మాల్దీవ్స్ కి వెళ్లారు. ఈ మేటర్ కూడా లీకైంది. అసలు ఇద్దరూ ఒకే గదిలో స్టే చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి.

ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ వలె మెలుగుతోంది. విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ చిన్న వేడుక జరిగినా రష్మిక మందాన వాలిపోతుంది. ఆ పార్టీల్లో ఒక్క రష్మిక మందాన మాత్రమే కనిపిస్తుంది. చివరికి 2023 దీపావళి వేడుకలు కూడా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి జరుపుకుంది రష్మిక మందాన. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా… లవర్స్ అంటే వారు ఒప్పుకోరు. మేము స్నేహితులం మాత్రమే. అంతకు మించి మా మధ్య ఎలాంటి బంధం లేదంటారు.

కానీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాగా హీరో రన్బీర్ కపూర్ ఫ్లోలో రష్మిక-విజయ్ దేవరకొండ ఎఫైర్ పై హింట్ ఇచ్చాడు. యానిమల్ మూవీ డిసెంబర్ 1న విడుదల అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రన్బీర్ కపూర్, రష్మిక మందాన కలిసి పాల్గొంటున్నారు. ఓ టీవీ షోలో పాల్గొన్న రన్బీర్… దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదటిసారి రష్మికను అర్జున్ రెడ్డి సక్సెస్ మీట్లో కలిశాడు. విజయ్ దేవరకొండ ఇంటి మేడపై జరిగిన పార్టీలో రష్మిక పాల్గొనగా సందీప్ రెడ్డి, రష్మికలకు అక్క పరిచయం ఏర్పడింది అన్నారు.

వెంటనే అలర్ట్ అయిన రష్మిక… ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకని రష్మిక రన్బీర్ కపూర్ ని అడ్డుకుంది. దీంతో రష్మిక-విజయ్ దేవరకొండల పరిచయం ఇప్పటిది కాదని తెలుస్తుంది. గీత గోవిందం మూవీ తర్వాత వాళ్ళు దగ్గరయ్యారని అందరూ భావించారు. కాదని తేలిపోయింది. ఆ చిత్రానికి ముందే పరిచయం ఉంది. ఆ సినిమాలో కెమిస్ట్రీ ఆ రేంజ్ లో పండటానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. అనుకోకుండా రన్బీర్ కపూర్ విజయ్ దేవరకొండ-రష్మికల లవ్ మేటర్ లీక్ చేశాడనే వాదన మొదలైంది.