కుర్రాళ్లకు రష్మిక ప్రత్యేక రిక్వెస్ట్ !

క్యూట్ బేబీ రష్మిక మండన్నా తాజాగా తన అభిమానులకు ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ ను పెట్టుకుంది. దయచేసి తనని చూసేందుకు వందల కిలోమీటర్లు ఎవ్వరూ ప్రయాణం చేయొద్దని, అది తనకు ఎంతగానో బాధను కలిగిస్తుందని తెగ ఫీల్ అయిపోతూ చెబుతుంది రష్మిక. ఇంతకీ ఉన్నట్టు ఉండి ఈ క్రేజీ బ్యూటీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది అంటే.. ? ఇటీవల రష్మికని చూసేందుకు తెలంగాణాకి చెందిన ఒక కుర్రాడు కర్ణాటకలోని రష్మిక ఇంటి ఎదుట రెండు రోజుల […]

Written By: admin, Updated On : June 28, 2021 11:20 am
Follow us on

క్యూట్ బేబీ రష్మిక మండన్నా తాజాగా తన అభిమానులకు ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ ను పెట్టుకుంది. దయచేసి తనని చూసేందుకు వందల కిలోమీటర్లు ఎవ్వరూ ప్రయాణం చేయొద్దని, అది తనకు ఎంతగానో బాధను కలిగిస్తుందని తెగ ఫీల్ అయిపోతూ చెబుతుంది రష్మిక. ఇంతకీ ఉన్నట్టు ఉండి ఈ క్రేజీ బ్యూటీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది అంటే.. ? ఇటీవల రష్మికని చూసేందుకు తెలంగాణాకి చెందిన ఒక కుర్రాడు కర్ణాటకలోని రష్మిక ఇంటి ఎదుట రెండు రోజుల పాటు అక్కడే మకాం పెట్టాడు.

చివరకు రష్మిక ఇంట్లో నుండి బయటకు వచ్చి విషయం ఆరా తీస్తే నేను మీకు అభిమానిని అంటూ చెప్పడం మొదలు పెట్టాడట. ఇక చేసేదేం లేక ఈ బ్యూటీ ఆ కుర్రాడితో ఒక ఫోటో దిగి, భోజనం కూడా పెట్టించి.. మళ్ళీ ఇలా ఎప్పుడు రావొద్దు అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఆ తరువాత అంటే లాక్ డౌన్ లో రష్మికను కలవాలని మరో కుర్రాడు తెగ ప్రయత్నం చేశాడు.

రష్మిక ఇంటి చుట్టూ ఆ కుర్రాడు అనుమానంగా తచ్చాడుతున్నాడని రష్మిక సిబ్బంది నుండి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వచ్చి ఆ కుర్రాణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తే.. రష్మిక అభిమానిని, ఆమెతో ఫోటో దిగాలని వచ్చాను అని చెప్పుకొచ్చాడట. వెళ్లి పోమని ఎంత చెప్పినా వినకపోయే సరికి, పోలీసులు ఆ కుర్రాడికి రెండు తగిలించి అక్కడి నుండి పంపించారు.

ఈ విషయం పోలీసులు ద్వారా తెలుసుకున్న రష్మిక బాగా ఫీల్ అయిందట. అందుకే తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ పెడుతూ.. “దయచేసి అలాంటి పనులు చేయొద్దు. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అతన్ని కలవకలేక పోయినందుకు బాధగా ఉన్న మాట వాస్తవం. అయితే భవిష్యత్తులో అతన్ని కలుస్తానని అనుకుంటున్నా. కానీ ఇలా ఎవ్వరూ రిస్క్ తీసుకోవద్దు’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.