‘రజినీకాంత్ – మోహన్ బాబు’ గ్యాంగ్ స్టర్స్.. పిక్స్ వైరల్ !

అది 1980వ సంవత్సరం.. మద్రాసులో వాహినీ స్టూడియోలో ఏదో సినిమా ఒకటి జరుగుతుంది. ఆ సినిమాలో హీరోలు ఎవరో తెలియదు కానీ, విలన్స్ మాత్రం ఇద్దరు కుర్రాళ్ళు, అప్పుడే మొదటిసారి ఆ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. మొదటి కలయికలోనే ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. పైగా ఇద్దరు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అప్పుడప్పుడే చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పైకి వస్తున్నారు. కట్ చేస్తే.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘నట్చతీరమ్’ అనే తమిళ్ […]

Written By: admin, Updated On : May 21, 2021 3:24 pm
Follow us on

అది 1980వ సంవత్సరం.. మద్రాసులో వాహినీ స్టూడియోలో ఏదో సినిమా ఒకటి జరుగుతుంది. ఆ సినిమాలో హీరోలు ఎవరో తెలియదు కానీ, విలన్స్ మాత్రం ఇద్దరు కుర్రాళ్ళు, అప్పుడే మొదటిసారి ఆ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. మొదటి కలయికలోనే ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. పైగా ఇద్దరు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అప్పుడప్పుడే చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పైకి వస్తున్నారు.

కట్ చేస్తే.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘నట్చతీరమ్’ అనే తమిళ్ మూవీకి శ్రీకారం చుట్టారు. యాదృచ్చికంగా ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఆ ఇద్దరు కలుసుకున్నారు. పర్సనల్ గా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆ తరువాత కాలం నుండి తరుచూ ఆ ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది.

అంతలో ఆ ఇద్దరు కెరీర్ లో పైకి ఎదిగారు, ఒకరు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అయితే, మరొకరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అయ్యారు. అప్పటి నుండి ఈ రోజు వరకు వారి మధ్య ఆ సాన్నిహిత్యం సంవత్సరాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. వారి బంధం ఇంకా బలపడుతూనే ఉంది. అందుకే రజిని ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఆనవాయితీ అయింది.

ప్రస్తుతం రజనీకాంత్ ‘అన్నత్తే’ అనే సినిమా షూట్ కోసం హైదరాబాద్ వచ్చి, మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నపాటి ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు. కాగా మంచు విష్ణు ఆ ఫోటోలను ట్వీట్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. పైగా అసలైన గ్యాంగ్ స్టర్స్ అంటూ ఆ ఫోటోలకు ట్యాగ్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.