Rajamouli and Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా గురించి ప్రతీ రోజు సోషల్ మీడియా లో ఎదో ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వస్తూనే ఉంది. మేకర్స్ ఈ సినిమా నుండి కనీసం ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకుల పర్వం ఆగడం లేదు. మీడియా కి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా లీక్ అవ్వడమే కాకుండా, షూటింగ్ వీడియో కూడా ఒకటి లీకై బాగా వైరల్ అయ్యింది. హీరో మహేష్ బాబు లుక్స్ ఆ వీడియో లో చాలా ఆసక్తికరంగా ఉండడంతో అభిమానులు రాజమౌళి మరోసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడు అని ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా లో శరవేగంగా జరుగుతుంది. మహేష్ బాబు, పృథ్వి రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి వారు ఈ షెడ్యూల్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు.
Also Read : అడ్వెంచర్ మాత్రమే కాదు..సైన్స్ ఫిక్షన్ కూడా..రాజమౌళి, మహేష్ సినిమా గురించి సంచలన అప్డేట్!
ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) ప్రవతి పరిదా(Pravati Parida) ట్విట్టర్ లో ఒక ఆసక్తి కరమైన ట్వీట్ వేసింది. ఆమె మాట్లాడుతూ ‘మహేష్ బాబు, రాజమౌళి కొత్త సినిమా మా ఓడిశాలోని మల్కాన్ గిరి లో షూటింగ్ జరగడం మా రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. గతంలో ఇక్కడ పుష్ప 2 మూవీ షూటింగ్ జరిగినప్పుడు ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు మహేష్, రాజమౌళి కూడా ఈ ప్రాంతాన్ని షూటింగ్ కోసం ఎంచుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం షూటింగులకు ఆకర్షణీయ కేంద్రం గా మారబోతుంది, స్థానిక పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది’ అంటూ ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. దీనికి సంబంధించిన ట్వీట్ ని అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి బాగా వైరల్ చేశారు. రాజకీయాల్లో లేకపోయినప్పటికీ, మహేష్ బాబు ని రాజకీయ నాయకులు ఈ విధంగా గౌరవిస్తారు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా. కేవలం ఒక్క భాగం లో కాదు, దాదాపుగా మూడు భాగాలుగా ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. మొదటి భాగం షూటింగ్ అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరి లోపు 70 శాతం కి పైగా పూర్తి అవుతుందని అంటున్నారు. టాకీ పార్ట్ తొందరగానే పూర్తి అవుతుంది కానీ, గ్రాఫిక్స్ వర్క్ ఈ సినిమాకి బోలెడంత ఉంటుందట. కాబట్టి కేవలం గ్రాఫిక్స్ కోసం ఏడాది కి పైగా సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉగాది కానుకగా ఈ సినిమా నుండి ఒక కూల్ సర్ప్రైజ్ ని అభిమానుల కోసం ప్లాన్ చేశారట మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం అడవిలో భారీ ఫైట్ ను సిద్ధం చేసిన రాజమౌళి…
Before, Pushpa-2 in Malkangiri, and now, renowned director SS Rajamouli's upcoming film SSMB29, starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran, along with internationally acclaimed actress Priyanka Chopra, is being shot in Koraput, proving that Odisha has a wealth…
— Pravati Parida (@PravatiPOdisha) March 11, 2025