Raghavenda Rao: ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ తీసుకున్న సినిమాల ప్రత్యేక షోలు.. టిక్కెట్ల ధర తగ్గింపు వంటి నిర్ణయాల సినిమా పరిశ్రమపై భారీ నష్టం ఉంటుందని అంటున్నారు దర్శక నిర్మాతలు. చిన్న చిత్రాలకు పెద్ద చిత్రాలకు వ్యత్యాసం ఉంటుందని ఆ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు హీరోలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ద్వారా మరోసారి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ద్వారా.. సినిమా టికెట్ల పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని తనకు సినిమా ఇండస్ట్రీ లో 45 సంవత్సరాల అనుభవం ఉందని.. నా అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.సినిమా ను థీయేటర్ లో చూసిన అనుభూతి టీవీ లో చూస్తే రాదు అని బెనిఫిట్ షో లు.. టికెట్ రేట్లు తగ్గించటం వల్ల అందరూ నష్టపోతారని తీసిన అన్ని సినిమా లు అని హీట్ కావని కేవలం 10 శాతం సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని అన్నారు. సినిమా మంచి గా ఉంటే ప్రేక్షకుడు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఖర్చు చేసి చూస్తాడని అన్నారు.
ఆన్ లైన్ విధానం తో దోపిడీ ఆగిపోతుంది అని అనటం కరెక్ట్ కాద ని తెలిపారు. సినిమా నచ్చకపోతే టికెట్ ధర రూపాయి ఉన్నా ప్రేక్షకులు చూడరని ఆన్ లైన్ విధానం వల్ల కొంత మంది బ్లాక్ లో టికెట్ లు అమ్మే అవకాశం ఉందని దర్శకుడు రాఘవేంద్ర రావు గారు సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడాలి మరి ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల విషయంలో తన నేమ్ లో నిర్ణయంలో ఎటువంటి ఎటువంటి మార్పులు చేయనుంది అనేది.