Radhe Shyam: యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా రాధేశ్యామ్. దర్శకుడు రాధా కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ లవ్స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మితమవుతోంది. అయితే, కొన్ని రోజులు నుంచి ప్రభాస్ అభిమానులు సోషల్మీడియా వేదికగా రాధేశ్యాప్ అప్డేట్ కావాలని మేకర్స్ను డిమాండ్ చేస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరు సూసైడ్ లెట్ రాయడం చర్చనీయాంశమైంది. మరోవైపు, యూవీ క్రియేషన్స్ను టాక్ చేస్తూ. బాన్ యూవీ క్రియేషన్స్ అంటూ నెట్టింట్ వైరల్ చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులను కాస్త శాంతిపంచేసేందుకు రాధేశ్యామ్ టీమ్ కొత్త అప్డేట్ విడుదల చేసింది. రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందంటూ.. డేట్ను ప్రకటించారు. అభిమానులు గతంలో విడుదల చేసిన పోస్టర్లో ఉన్న డేట్లోనే అఫిసియల్ లుక్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఈ రాతలే అనే లిరికల్ సాంగ్ వీడియోను నవంబరు 15 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా, ప్రభాస్ సలార్ సినిమాలోనూ నటిస్తున్నారు.