యంగ్ హీరోయిన్ ను మిస్సవుతున్న పూరీ

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయింది. దీంతో ఆయనకు పలువురు సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. పూరి జగన్మాథ్ 2000 సంవత్సరంలో తెరకెక్కించిన ‘బద్రి’ సినిమా నేటితో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ పూరి జగన్మాథ్, హీరోయిన్ రేణుదేశాయ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పవన్ తొలినాళ్లలో ‘బద్రి’ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 3:20 pm
Follow us on


స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయింది. దీంతో ఆయనకు పలువురు సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. పూరి జగన్మాథ్ 2000 సంవత్సరంలో తెరకెక్కించిన ‘బద్రి’ సినిమా నేటితో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ పూరి జగన్మాథ్, హీరోయిన్ రేణుదేశాయ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పవన్ తొలినాళ్లలో ‘బద్రి’ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్లాడు డైరెక్టర్ పూరి జగన్మాథ్. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమా తెరకెక్కించారు. అయితే ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో కొంత ఢీలా పడ్డారు.

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

డైరెక్టర్ గా పూరి పని అయిపోయిందనుకున్న టైంలోనే పూరి తన మార్క్ హిట్టందుకొని మళ్లీ సక్సస్ బాటపట్టారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో పూరి జగన్నాథ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించారు. ఈ సినిమాలో రామ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు నటించారు. ఈ సినిమా డైరెక్టర్ పూరితోపాటు హీరో రామ్, హీరోయిన్లకు మంచి లైఫ్ ఇచ్చింది. డైరెక్టర్ గా 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ కు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో విషెస్ చెప్పింది. ‘మానవత్వం ఉన్న మనిషి.. లవ్ యూ సార్’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

కక్షసాధింపు వదిలి కరోనా సంగతి చూడు జగన్

నిధి అగర్వాల్ ట్వీట్ కు స్పందించిన పూరి వెంటనే ‘నిధి ఐ లవ్ యూ.. నిన్ను మిస్ అవుతున్నా.. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇదంతా బాగనే ఉన్నా.. యంగ్ హీరోయిన్ కు పూరి జగన్నాథ్ ఐ లవ్ యూ.. మిస్ అవుతున్నా అంటూ సంబోధించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లలో మరో సినిమా రాబోతుందని పూరి హింటిచ్చాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..!