‘ఆర్ ఆర్ ఆర్’ ని తలదన్నేలా ప్రభాస్ చిత్రం

ప్రభాస్ సినిమా కెరీర్ ని రెండు రకాలుగా చెప్పక తప్పదు .బాహుబలి కి ముందు , బాహుబలి తరవాత అనే విధంగా ప్రభాస్ కెరీర్ మారిపోయింది. బాహుబలి కి ముందు ప్రభాస్ చిత్రాలు తెలుగు మార్కెట్ వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇపుడు ప్రభాస్ రేంజ్ మారింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఉత్తర భారత దేశం లో, మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ప్రభాస్ కి మార్కెట్ బాగా పెరిగింది. సాహో లాంటి ఫెయిల్యూర్ […]

Written By: admin, Updated On : April 20, 2020 3:21 pm
Follow us on


ప్రభాస్ సినిమా కెరీర్ ని రెండు రకాలుగా చెప్పక తప్పదు .బాహుబలి కి ముందు , బాహుబలి తరవాత అనే విధంగా ప్రభాస్ కెరీర్ మారిపోయింది. బాహుబలి కి ముందు ప్రభాస్ చిత్రాలు తెలుగు మార్కెట్ వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇపుడు ప్రభాస్ రేంజ్ మారింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఉత్తర భారత దేశం లో, మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ప్రభాస్ కి మార్కెట్ బాగా పెరిగింది. సాహో లాంటి ఫెయిల్యూర్ (తెలుగులో) చిత్రం హిందీ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. మంచి షేర్ రాబట్టింది.

పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి!

కాగా ప్రస్తుతం ప్రభాస్ ` జిల్ ` ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ తో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నాడు. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈ చిత్రాన్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మంచి బిజినెస్ అఫర్లు వస్తున్నాయి .కాగా ప్రభాస్ తన తదుపరి చిత్రంగా ` మహానటి ` ఫేమ్ నాగ్ అశ్విన్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు .

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ విషయం లో కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ క్రమం లో హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపనున్నారట…అలాగే బాలీవుడ్ నుండి హీరోయిన్ తో పాటు కీలక నటులను దిగుమతి చేసుకో నున్నారు .. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఆ క్రమం లో ఈ చిత్రం యొక్క బడ్జెట్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి మించ నుంది.