Producers Vs Exhibitors Dispute: సినిమా ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి… ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే సింగల్ స్క్రీన్ లో చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ మల్టీప్లెక్స్ లో రాదు. ఇక చాలామంది ఎంజాయ్ చేయాలని సినిమా చూస్తుంటారు. కాబట్టి సినిమా మధ్యలో అరవడాలు జన సందోహంలో సినిమాను చూసి ఇష్టపడుతుంటారు. అదంతా సింగిల్ స్క్రీన్ కే సాధ్యమవుతుంది. దానివల్ల ఎక్కువ మంది సింగిల్ స్క్రీన్ లను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్ లు మూతపడే పరిస్థితి ఏర్పడింది…గత కొద్ది రోజుల నుంచి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్లు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని చాలామంది ప్రొడ్యూసర్లతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికి అవేవీ సఫలం అయ్యే విధంగా కనిపించడం లేదు… ప్రస్తుతం రెంటల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక మీదట కూడా అలాగే చేసినట్లయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడక తప్పదనే ఆలోచించినలో ఎగ్జిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు.
ఈనెల 30లోగా నిర్మాతలందరితో కలిసి పర్సంటేజ్ విధానం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే మే 1 వ తేదీ నుంచి సింగల్ స్క్రీన్ లను మూసేయడానికి ఎగ్జిబ్యూటర్లు పిలుపునిచ్చారు. ఇక ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తున్నారు.మరి నిర్మాతలు సింగిల్ స్క్రీన్ ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు.
ఎగ్జిబ్యూటర్లను ఆదుకునే విధంగా ఆలోచనలు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక చాలా మంది జనాలు సైతం మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. కారణమేమిటి అంటే మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్లు ఎక్కువ అలాగే ఇంటర్వెల్ సమయంలో కొనుక్కునే పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ కూడా డబుల్ త్రిబుల్ చేసి అమ్ముతున్నారు.
కాబట్టి మల్టీ ఫ్లెక్స్ కంటే సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూస్తేనే ప్రేక్షకులకు టిక్కెట్ రేట్ తగ్గడంతో పాటు ఎంజాయ్ మెంట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్స్ మూతపడితే మాత్రం చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేస్తారనే చెప్పాలి…ఇప్పటికే వివిధ కారణాలతో ప్రేక్షకులు థియేటర్లో సినిమాలు చూడటమే మానేశారు… ఇక ఇప్పుడు ఇవి మూసేస్తే సినిమాలకు భారీ లాస్ రావడం ఖాయం…