Rajamouli Son: ఈ మధ్య కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. రీసెంట్ గా అచ్చం ఇదే మాదిరి ఓ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. యువనటులతో కేవలం రూ. 3 కోట్ల పెట్టుబడి తో వచ్చిన ప్రేమలు అనే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు అనేక రికార్డులను సొంతం చేసుకొని 2024లో టాప్ మూవీ అనిపించుకుంది.
ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ది లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. గిరీష్ ఏడీ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమలు సినిమా మలయాళంలో మొదటి రోజు రూ.9 లక్షలను మాత్రమే వసూలు చేసింది. కానీ ఆ తర్వాత వారం మాత్రం ఏకంగా రూ. 12.6 కోట్లను వసూలు చేసి.. అందరిని షాక్ కు గురిచేసింది. మౌత్ టాకే ఈ సక్సెస్ కు కారణం అని టాక్.
మార్చి 8న తెలుగులో వచ్చి కూడా మంచి సక్సెస్ ను సాధించింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 104 కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు మమితా బైజు నటన కుర్రకారును కట్టిపడేసింది. దీంతో యూత్ ఫేవరేట్ గా నిలిచింది మమితా. ఈమె నటనకు జక్కన్నే ఫిదా అయ్యాడు అంటే ఆమె నటన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీను పాత్రలో నటించిన మమితా నచ్చిందని.. ప్రశంసల వర్షం కురిపించాడు జక్కన్న. దీంతో ఈమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
అయితే ఈ హీరోయిన్ ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆయన సినిమాను పది సార్లకంటే ఎక్కువ చూస్తుందట. ఎంజాయ్ చేయాలి అనిపిస్తే.. ఆయన సినిమాలే చూస్తుందట. బన్నీ అంటే అంత ఇష్టమన్నమాట. అయితే ఈమె నటించిన ప్రేమలు సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన 5వ మలయాళ సినిమాగా నిలిచింది.