కాగా.. ఇప్పుడు సమంత నటించే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రంగం సిద్ధమైంది. గతంలో నయనతారతో “మయూరి” , ” తాప్సితో “గేమ్ ఓవర్” సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ తన తదుపరి సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కించబోతున్నాడు.కాగా ఈ సినిమాలో సమంత పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. హీరో పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అందుకే ఒకనాటి తమిళ హీరో త్యాగరాజన్ కొడుకు ,అలనాటి నటుడు పేకేటి శివరాం మనవడు అయిన హీరో ప్రశాంత్ ని ఈ చిత్రంలో హీరోగా ఎన్నిక చేశారట …
తమిళం లో ” వైకాసి పొరందాచి ” వంటి హిట్ చిత్రం తో కెరీర్ ఆరంభించి ఆ తరవాత చామంతి, సిటిజెన్ , తిరుడా తిరుడా (దొంగ దొంగ), జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ ఘన విజయాలు అందుకొన్నాడు. అయితే ఈ మధ్య కాలం లో ప్రశాంత్ కి సరైన హిట్స్ లేవు. అయితే ఇప్పుడు బాలీవుడ్ చిత్రం “అంధాదున్” రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు సమంతతో నటించడానికి ఓకే చెప్పాడట. గత ఏడాది తెలుగు చిత్రం వినయ విధేయ రామ చిత్రం లో రామ్ చరణ్ అన్నగా నటించిన ప్రశాంత్ మరలా తెలుగు ప్రేక్షకులకు హీరోగా కనిపించ బోతున్నాడు .try and try until success