వచ్చింది ప్రభాస్‌ మరి..

ఇది కరోనా కాలం. మనుషుల మధ్య దూరం పెంచిన సమయం. దూరమే మనుషులను కాపాడుతోంది. మనసులను దగ్గర చేస్తోంది. ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలుచునేందుకు భయపడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులను ముట్టుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచిస్తున్నారు. వైరస్‌ భయంతో మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తూ అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు జంకుతున్నారు. అలాంటి వాళ్లు ఎదురుగా బహుబలి ప్రభాస్‌ కనిపించేసరికి అన్నీ మరిచిపోయారు. సోషల్‌ డిస్టెన్స్‌, కరోనా రూల్స్‌ను పక్కనపెట్టేసి ఆ ఆజానుబాహుడికి […]

Written By: Neelambaram, Updated On : August 6, 2020 6:06 pm
Follow us on


ఇది కరోనా కాలం. మనుషుల మధ్య దూరం పెంచిన సమయం. దూరమే మనుషులను కాపాడుతోంది. మనసులను దగ్గర చేస్తోంది. ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలుచునేందుకు భయపడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులను ముట్టుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచిస్తున్నారు. వైరస్‌ భయంతో మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తూ అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు జంకుతున్నారు. అలాంటి వాళ్లు ఎదురుగా బహుబలి ప్రభాస్‌ కనిపించేసరికి అన్నీ మరిచిపోయారు. సోషల్‌ డిస్టెన్స్‌, కరోనా రూల్స్‌ను పక్కనపెట్టేసి ఆ ఆజానుబాహుడికి దగ్గరగా వచ్చేశారు. ఇది కలా నిజమా అనుకుంటేనే సిల్వర్ స్క్రీన్‌‌ డార్లింగ్‌ను తమ మొబైల్‌ కెమెరాలతో బంధించారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ఇందుకు వేదికైంది.

Also Read: ‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఇంటికే పరిమితమైన ప్రభాస్‌ ఉన్నట్టుండి బుధవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యక్ష్యమయ్యాడు. వ్యక్తిగత పని కోసం ప్రభాస్‌ అక్కడికి వచ్చాడు. బ్లూ షర్ట్‌, కళ్ల జోడు, ముఖానికి వైట్‌ మాస్కుతో సింపుల్‌గా ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన డార్లింగ్‌ ను చూసి అక్కనున్న ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. తన పని పూర్తి చేసుకొని ప్రభాస్‌ తిరుగు ముఖం పడుతుండగా అక్కడున్న పెద్ద ఆఫీసర్ల నుంచి చిన్న ఉద్యోగుల వరకూ అతని దగ్గరికి వచ్చేశారు. ఒక్క ఫొటో, ఒక్క సెల్ఫీ ప్లీజ్‌ అంటూ అతనితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎప్పట్లాగే కూల్‌గా ఉన్న డార్లింగ్‌ అందరికీ ఫొటోలు ఇచ్చాడు. దీనికి కొంత సమయం పట్టినప్పటికీ ఓపిగ్గా ఉన్నాడు. అభిమానులందరినీ సంతృప్తి పరిచాక..చెరగని చిరునవ్వుతో తన కారెక్కాడు.

Also Read: పాపం.. సీనియర్ హీరోకి నిర్మాణ కష్టాలు !

ఇప్పుడు ఈ ఫొటోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. లాక్‌డౌన్‌ టైలో కూడా అభిమానుల దగ్గరికొస్తే ఆప్యాయంగా పలుకరించి వారి చిరు కోరికలను తీర్చిన ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. చివరగా సాహోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రెబల్‌ స్టార్.. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ ముందు వరకూ జార్జియాలో శరవేగంగా షూటింగ్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. తొందర్లోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తోంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ మూవీకి కూడా ప్రభాస్‌ సైన్‌ చేశాడు.

https://twitter.com/BollywudPrabhas/status/1291219689188651009