‘బాహుబలి’ సిరీసుల తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం ప్రభాస్ క్రేజ్ ను మరింత పెంచింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ రిలీజై సెన్షేషన్ క్రియేట్ చేసింది.
‘రాధేశ్యామ్’ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కరోనా తగ్గాక ఇటలీలో షూటింగు జరుపుకుంటున్న తొలి సినిమాగా ‘రాధేశ్యామ్’ నిలువడం విశేషం. 1980 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ఇటలీలో ప్రత్యేక సెట్లను వేశారు. ఈ సినిమా షూటింగ్ చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున లోకేషన్లకు తరలివస్తున్నారు.
Also Read: రేటింగ్స్ పడిపోతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు?
ప్రభాస్ కు అంతర్జాతీయంగా క్రేజ్ ఉండటంతో ఇటాలియన్లు ‘రాధేశ్యామ్’ మూవీపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలు మీడియా సంస్థలు ‘రాధేశ్యామ్’ మూవీ.. ప్రభాస్ క్రేజ్ గురించి పలు కథనాలను ప్రసారం చేశారు. అక్కడి లోకల్ మీడియా సైతం ప్రభాస్ ఇంటర్వ్యూలు తీసుకుంటూ ‘రాధేశ్యామ్’ విశేషాలను అందరికీ తెలియజేస్తున్నాయి.