బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.. ఆ ఇమేజ్ తగ్గట్టుగానే సినిమాలు చేసుకుపోతున్న ఈ రెబల్ స్టార్… ప్రస్తుతం తన 20వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థలు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
కాగా,టైటిల్ లేని ఈ సినిమాకి ‘ఓ మైడియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్ 16న సందడి చేయనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాధాకృష్ణ రూపొందిస్తున్న “ప్రభాస్ 20″లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.