Mahesh: పవర్స్టార్ పవన్కల్యాణ్కు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, మహేశ్బాబుకు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో ప్రస్తుతం అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా అయినా చూడాలని వారి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వీరిద్దరు ఎప్పుడైనా కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం చాలా సార్లు చూశాం. తాజాగా, దీపావళి సందర్భంగా పవన్ కల్యాణ్- మహేశ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
పండుగను పురస్కరించుకుని పవన్ సినీ ఇండస్ట్రీలో ఆప్తులైన వారికి కానుకలు పంపించారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు కుటుంబానికీ గిఫ్ట్ పంపించారు. ఇందులో పర్యావరణానికి హాని చేయని టపాసులతో పాటు కొన్ని మిఠాయిలూ ఉన్నాయి. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలియజేసింది. ఇంత విలువైన కానులు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపింది.

మహేశ్తో పాటు దర్శకులు హరీశ్ శంకర్, క్రిష్లు కూడా పవన్కు విషెస్ చెప్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవన్. భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక మహేశ్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ను దాదాపు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఏప్రిల్లో మహేశ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా… భీమ్లనాయక్ మాత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.