అపజయాలే మన విజయానికి మెట్లు అన్న చందంలో కెరీర్ ఆరంభంలో వరుస అపజయాలు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస విజయాలు దక్కించుకొంటోంది. దరిమిలా ఊపిరి సలపనంత బిజీ గా మారింది. ప్రస్తుతం తెలుగు తెరపై పూజ హెగ్డే హవా నడుస్తోంది. ‘అరవింద సమేత’ ఆ తరవాత `మహర్షి` వంటి విజయాల తర్వాత తన విజయ పరంపర కొనసాగిస్తూ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకొంది ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 162 కోట్ల కు పైగా షేర్ సాధించి బాహుబలి 2 చిత్రం తరవాతి స్థానం ఆక్రమించింది.
ప్రస్తుతం బుట్ట బొమ్మ డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నపాన్ ఇండియా మూవీ లో నటిస్తోంది. అంతేగాక అఖిల్ అక్కినేని హీరోగా -బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం లో నటించేందుకు హీరో కంటే ఎక్కువ పారితోషకం తీసుకొంది.
అలా ఫుల్ స్వింగ్ లో నడుస్తోన్న బుట్టబొమ్మ కెరీర్ లో మరో సూపర్ ఆఫర్ వెతుక్కొంటూ వచ్చింది. తమిళ టాప్ డైరెక్టర్ లలో ఒకడైన సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో నటించే చాన్సు దక్కించు కొంది. ఈ సినిమాలో హీరోగా గజినీ ఫేమ్ సూర్య హీరోగా నటిస్తున్నాడు.
కాగా ఈ చిత్రానికి ” ఆరువ “అని టైటిల్ పెట్టడం జరిగింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత వుంటుందట …ఇంతకీ అరువ అంటే తెలుసా …తెలుగులో పువ్వు లేదా పుష్పం అని అర్ధం వస్తుంది ..