తప్పును దిద్దుకుంటున్న పూజా హెగ్డే..!

ముంబైకి చెందిన పూజా హెగ్డే ‘ముకుంద’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ముకుంద’ సమయంలోనే పూజా హెగ్డేకు బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటించిన ‘మొహెంజోదారో’ మూవీలో ఛాన్స్ వచ్చింది. పూజా హెగ్డే తెలుగులో నటించిన ‘ముకుంద’ మూవీ సూపర్ హిట్టు కాగా.. బాలీవుడ్లో ఆమె నటించిన ‘మొహెంజోదారో’ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ పూజా హెగ్డే కు టాలీవుడ్లోని స్టార్ పక్కన నటించే ఛాన్స్ రావడంతో ఆమెకు దక్షిణాదిలోనూ […]

Written By: NARESH, Updated On : November 9, 2020 6:54 pm
Follow us on

ముంబైకి చెందిన పూజా హెగ్డే ‘ముకుంద’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ముకుంద’ సమయంలోనే పూజా హెగ్డేకు బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటించిన ‘మొహెంజోదారో’ మూవీలో ఛాన్స్ వచ్చింది. పూజా హెగ్డే తెలుగులో నటించిన ‘ముకుంద’ మూవీ సూపర్ హిట్టు కాగా.. బాలీవుడ్లో ఆమె నటించిన ‘మొహెంజోదారో’ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

పూజా హెగ్డే కు టాలీవుడ్లోని స్టార్ పక్కన నటించే ఛాన్స్ రావడంతో ఆమెకు దక్షిణాదిలోనూ క్రేజ్ దక్కించింది. దీంతో ఆమెకు బాలీవుడ్లోనూ ప్రస్తుతం ఆఫర్లు దక్కుతున్నాయి. అయితే పూజా హెగ్డే మాత్రం తాజాగా ఓ ఇంటర్వ్యూలో దక్షిణాదివారిని కించపరిచేలా మాట్లాడటంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. దీంతో తన తప్పును తెలుసుకున్న పూజా తన వ్యాఖ్యలను కవర్ చేసుకునే పనిలో పడింది.

Also Read: ‘ఆది పురుష్’కి సప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ !

దక్షిణాదివారికి న‌డుమంటేనే వ్యామోహ‌మ‌ని.. హీరోయిన్ల‌ను మిడ్ డ్రెస్సులో చూసేందుకు ఆరాటపడుతారని అనడంతో వివాదం చెల‌రేగింది. దీంతో నెటిజ‌న్లు పూజాను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ లేఖను విడుదల చేసింది. అక్ష‌రాన్ని మార్చ‌గ‌ల‌రేమోగానీ.. అభిమానాన్ని కాద‌ంటూ ఆ లేఖలో పేర్కొంది. త‌న‌కు టాలీవుడ్ అంటే అన్ని వేళ‌లా ప్రాణ‌మ‌ని చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా తనకు ఎంతో కీర్తి ప్ర‌తిష్ఠలు తెచ్చిపెట్టిన టాలీవుడ్‌కు తాను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటానని చెప్పింది. త‌న ఇంట‌ర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థ‌మ‌వుతుందని స‌ల‌హా ఇచ్చింది. ఇందులో తాను తెలుగు ప్రేక్ష‌కులు సినిమా వాళ్ల‌ను ఆరాధిస్తార‌ని.. దేవుళ్ల‌గా పూజిస్తార‌ని చెప్పినట్లు పేర్కొంది.

Also Read: టాలీవుడ్ దిగ్గజాలు అప్పట్లో భూములను ఎంతకు కొన్నారంటే?

దక్షిణాదివారికి నడుము అంటే ఇష్టమని అయితే తనకు మాత్రం తన కాళ్లు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో అలా వ్యాఖ్యలు చేసినట్లు చెప్పింది. ఇలా లేఖ విడుదల చేయడం ద్వారా పూజా హెగ్డే తనపై వస్తున్న వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. మరీ ఈ వివాదం సర్దుమ‌ణుగుతుందో లేదో వేచిచూడాల్సిందే..!