పైరసీ: నిన్నే రిలీజ్.. వెబ్ సైట్ లో ఫుల్ మూవీ

  కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ కుదేలైంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. సినీ రంగాన్ని కరోనా అన్ని రంగాలకంటే తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రభావాలతో థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్స్ నిలిచిపోవడంతో దర్శక నిర్మాతలకు భారీగా నష్టాన్ని చేకూర్చిపెట్టాయి. ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటుండగా.. సినిమాలను విడుదల చేసే పనిలో పడ్డారు నిర్మాతలు.. ఇటీవలే యంగ్ హీరోలు సత్య దేవ్, తేజ […]

Written By: NARESH, Updated On : August 7, 2021 1:20 pm
Follow us on

 

కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ కుదేలైంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. సినీ రంగాన్ని కరోనా అన్ని రంగాలకంటే తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రభావాలతో థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్స్ నిలిచిపోవడంతో దర్శక నిర్మాతలకు భారీగా నష్టాన్ని చేకూర్చిపెట్టాయి. ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు.

సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటుండగా.. సినిమాలను విడుదల చేసే పనిలో పడ్డారు నిర్మాతలు.. ఇటీవలే యంగ్ హీరోలు సత్య దేవ్, తేజ సజ్జులు తమ మూవీలను రిలీజ్ చేసి షూరూ చేశారు. ‘తిమ్మరుసు’, ఇష్క్ మూవీలు థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ శుక్రవారం ఏకంగా ఆరు చిన్న సినిమాలను నిర్మాతలు విడుదల చేశారు. దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కించిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ కూడా నిన్న సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా రెండో సినిమాగా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సాయికుమార్, ప్రియాంక జువాల్కర్ కీలక పాత్రలు పోషించారు.

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రాన్ని పైరసీ భూతం వెంటాడింది. నిన్న ఉదయం సినిమా విడుదల కాగా.. సాయంత్రానికి పలు వెబ్ సైట్లలో ఈ సినిమా పైరసీ ప్రింట్ వచ్చేసింది. ఇప్పటికే కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు పైరసీ భూతం మరింత నష్టాన్ని చేకూర్చనుంది.