Peddi Success Meet: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఓవర్సీస్, నార్త్ ఇండియా మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్స్ లో ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే బయ్యర్స్ కి 50 శాతానికి పైగా నష్టాలు వాటిల్లాయి. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ రన్ పై నిర్మాత కూడా అసంతృప్తి వ్యక్తం చేసాడు. అయితే ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది అని అంటున్నారు , అందులో ఎలాంటి నిజం లేదని టాక్. ప్రతీ సినిమాకు లాగానే ఈ సినిమాకు కూడా నిర్మాతలు వేసిన ఒక ప్రమోషనల్ పోస్టర్ మాత్రమేనని అంటున్నారు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ కోసం అభిమానులు చాలా రోజుల నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభ ని ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో నిర్వహించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్స్ ఈ ఈవెంట్ కి రానున్నారు. వాళ్లకు హీరో రామ్ చరణ్ చేత షీల్డ్స్ ని అందించబోతున్నారు మేకర్స్. అంతే కాకుండా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను స్పెషల్ గెస్ట్ గా పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారట. రీసెంట్ గానే పెద్ది మూవీ కి సంబంధించి , మెగాస్టార్ చిరంజీవి బుచ్చి బాబు తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇది సినిమా థియేట్రికల్ రన్ కి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు ఈ విజయోత్సవ సభ కూడా అదే రేంజ్ లో సినిమా థియేట్రికల్ రన్ ని ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొదటి 11 రోజులతో పోలిస్తే , సెకండ్ వీకెండ్ లో వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కొత్త సన్నివేశాలను జత చేసినప్పటికీ కూడా ఉపయోగం లేకపోయింది. సినిమా నిడివి ఎక్కువ ఉండడం వల్ల, రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్నారు. అందుకే చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ లను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథి గా పిలిస్తే , సినిమా రన్ కి చాల బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
