అన్నట్టు ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్ వర్క్ చేస్తున్నాడు. అలాగే రవి కే చంద్రన్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా
త్రివిక్రమ్ ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేశాడు. చకచకా షూటింగ్ను పూర్తి చేసేసుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే లీక్ అయిన మేకింగ్ వీడియోలు, స్టిల్స్ అన్నీ అదిరిపోయాయి.
మొత్తానికి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ మళయాలి రీమేక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ చేసిన మార్పులు పట్ల మేకర్స్ పట్ల సాగర్ చంద్ర అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే రచయిత సాయి మాధవ్ బుర్రా చేత ఒక వెర్షన్ స్క్రిప్ట్ రాయిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను పెంచబోతున్నారట.
అయితే, పవన్ కళ్యాణ్ పాత్రను పెంచడంతో పాటు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ను కూడా పెంచబోతున్నారట. అలాగే రానా చేస్తున్న రెండో పాత్ర ఇంపార్టెన్స్ ను కాస్త తగ్గిస్తున్నారని తెలుస్తోంది. ఐతే ఈ సినిమాలో ఉన్న రెండు బలమైన పాత్రలలోని ఆ టెంపో తగ్గితే.. కథలో ప్లో కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇవన్నీ మేకర్స్ ఆలోచించుకుని మార్పులు చేస్తే బాగుంటుంది.