Peddi Success Meet: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ , ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తోటి స్టార్ హీరోలు నేడు పాన్ ఇండియా లో అడుగుపెట్టి మార్కెట్ పరంగా ఆయన్ని దాటేసి ఉండొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన క్రేజ్ , ఫాలోయింగ్ ని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు అనేది విశ్లేషకుల వాదన. ఆయనది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని , ఒక సినిమా ఫ్లాప్ తో పోయేది కాదని రాజకీయాల్లోకి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అయ్యాక సినిమాల్లో క్రేజ్ తగ్గుతుందని అనుకున్నారని , కానీ ఇసుమంత కూడా తగ్గలేదని విషయం గత ఏడాది విడుదలైన ‘ఓజీ’ చిత్రం తో తెలిసొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ కి మరో ఉదాహరణ గా నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిగింది ‘పెద్ది’ సక్సెస్ మీట్ నిల్చింది.
ఈ విజయోత్సవ సభలో ఆ చిత్ర నిర్మాత సతీష్ కిలారి ‘పెద్ది’ సినిమాకు టిక్కెట్ రేట్స్ , స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు , ఉప ముఖ్యమంత్రులకు కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ క్రమం లో ఆయన పవన్ కళ్యాణ్ పేరు తీయగానే ఒక్కసారిగా సభ మొత్తం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. నిర్మాతని దాదాపుగా 30 సెకండ్ల వరకు అభిమానులు అరుపులు , ఈలలు, కేకలతో హోరెత్తించారు. పాపం నిర్మాతకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఈ ఈవెంట్ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి షాక్ కి గురై అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు అత్తారింటికి దారేది ఆడియో లంచ్ ఈవెంట్ ని గుర్తు చేసుకున్నారు.
ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడేందుకు మైక్ అందుకోగా, అభిమానులు ఉత్సాగంతో అరుస్తూ , ఈలలు ఇస్తూ ఒక 30 సెకండ్ల వరకు ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేశారు. ఈ ఈవెంట్ జరిగి 13 ఏళ్ళు అయ్యింది , అప్పటికీ ఇప్పటికీ కాలం లోనే మార్పు , పవన్ కళ్యాణ్ క్రేజ్ లో కాదు అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ కి సుకుమార్, అనిల్ రావిపూడి వంటి వారు కూడా స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహానికి చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
