
కొంత విరామం తరవాత రాజకీయాల తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వబోతున్నక్రమంలో వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. అందులో మొదటగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తిగాకుండానే క్రిష్ డైరెక్షన్లో తన 27 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు. ఇక ఈ చిత్రం తరవాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ చిత్రం ఉంటుందని ప్రకటించేసాడు.. మరో పక్క తరువాతి చిత్రాల కోసం కూడా కథలు వింటున్నట్టు రూఢీగా తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ మల్టీ స్టారర్ కథని ఓకే చేసినట్టు తెలుస్తోంది
పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తం లో చేసిన ఒకే ఒక్క మల్టీ స్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’. ఈ చిత్రం డైరెక్ట్ చేసిన కిశోర్ పార్థసాని(డాలీ) తోనే ఇప్పుడు మరో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మల్టీ స్టారర్ చిత్రం లో రెండో హీరోగా మాస్ మహారాజ్ రవితేజ నటిస్తాడని తెలుస్తోంది. రవితేజ తో ‘నేల టిక్కెట్’ ‘డిస్కో రాజా’ చిత్రాల్ని నిర్మించిన ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మించ బోతున్నట్టు కూడా తెలుస్తోంది.
రవితేజ తో చేసిన ‘నేల టిక్కెట్’ ‘డిస్కో రాజా’ చిత్రాలు డిజాస్టర్ కావడం వల్ల పీకల్లోతు నష్టాలలో కూరుకుపోయాడు. నిర్మాత రామ్ తాళ్లూరి….ఇప్పుడు ఈయన్ని ఆ అప్పుల్లో నుండీ విడిపించడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది.
ఐటీ వ్యాపారవేత్త, సినీ నిర్మాత అయిన రామ్ తాళ్లూరి. ‘లీడ్ ఐటీ’ అనే సంస్థతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఈయనకు జనసేనాని పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు. రామ్ తాళ్లూరిని రీసెంట్ గా “వ్యాపార దక్షతతోనే కాకుండా, సామాజిక స్ఫూర్తి పరంగానూ తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్న వ్యక్తి” అని కొనియాడగా దానికి “మీ అభినందనలే నాకు దక్కిన అపురూప గౌరవంగా భావిస్తాను” అని రామ్ తాళ్లూరి ధన్యవాదాలు కూడా తెలిపారు. అలాంటి బంధం వారిద్దరిది. అందుకే అడగ్గానే మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది .
a friend in need is friend indeed