నేను చనిపోలేదని చేతులు జోడించిన గ్రేట్ యాక్టర్ !

బాలీవుడ్ మీడియా బతికి ఉన్న నటీనటులను చంపేస్తూ వస్తోంది. పాపం ఓ నటుడు బతికి ఉండగానే, చనిపోయాడు అని వార్తలు వస్తే, ఆ నటుడికి ఎంత బాధ ఉంటుంది. అయితే తను మరణించినట్లు వస్తున్న వార్తల పై బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ డిఫరెంట్ గా స్పందించారు. ‘నేను ఇంకా చనిపోలేదు, కాకపోతే ఎక్కువ సేపు నిద్రపోయానంతే’ అంటూ ఆయన తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. పరేశ్‌ రావల్‌ అంటే చిన్న నటుడు ఏమి కాదు, చాల […]

Written By: admin, Updated On : May 15, 2021 4:01 pm
Follow us on

బాలీవుడ్ మీడియా బతికి ఉన్న నటీనటులను చంపేస్తూ వస్తోంది. పాపం ఓ నటుడు బతికి ఉండగానే, చనిపోయాడు అని వార్తలు వస్తే, ఆ నటుడికి ఎంత బాధ ఉంటుంది. అయితే తను మరణించినట్లు వస్తున్న వార్తల పై బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ డిఫరెంట్ గా స్పందించారు. ‘నేను ఇంకా చనిపోలేదు, కాకపోతే ఎక్కువ సేపు నిద్రపోయానంతే’ అంటూ ఆయన తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.

పరేశ్‌ రావల్‌ అంటే చిన్న నటుడు ఏమి కాదు, చాల పెద్ద నటుడు, అలాంటి నటుడి విషయంలో కూడా మీడియా అశ్రద్ధగా ఎలా వార్తలు రాస్తోంది అంటూ మీడియా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అసలు ఈ వార్త ఎలా పుట్టింది అంటే.. నిన్న ఉదయం 7 గంటలకు పరేశ్‌ రావల్‌ చనిపోయినట్లుగా ట్విటర్ లో ఓ నెటిజన్‌ మెసేజ్ పెట్టాడు. అది చూసి కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్స్ పరేశ్ చనిపోయాడని, ఆయన కండిషన్ సీరియస్ గా ఉందని వార్తలు రాసుకొచ్చాయి.

అయితే ఆ వార్తలు చూసిన పరేశ్ రావల్‌ తన మరణ వార్త పై చమత్కరంగా స్పందించారు. ఈ సందర్భంగా ట్వీట్‌ చేస్తూ.. ‘నేను చనిపోయానని మీకు అపోహ కలిగించిందుకు నన్ను మన్నించగలరు. ఉదయం 7 దాటాకా కూడా నేను ఎక్కువ సమయం నిద్రపోయానంతే. అయితే మీరు అపోహ పడినట్టు నేను చనిపోలేదు’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు.

అసలు ఇలాంటి వార్తలను సరిచూసుకోకుండా ఎలా రాస్తారు ? ఇలాంటి తప్పుడు ప్రచారాల పై చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయినా ఇలాంటి పుకార్లు రెగ్యులర్ గా పుట్టిస్తూనే ఉంటారు. ఆ మధ్య ప్రముఖ సింగర్‌ లక్కీ ఆలీ చనిపోయినట్టు రాసుకొచ్చారు. రీసెంట్ గా నటుడు ముఖేష్‌ కన్నా కోవిడ్‌తో మరణించినట్లు వార్తలు పుట్టించారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.