జోష్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గరమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈనేపథ్యంలోనే ఈ మూవీ నుంచి త్వరలో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాషీ గా ఉన్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ టీజర్ పైనే చర్చ నడుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ పై పడినట్లు కన్పిస్తోంది. Also Read: పోస్ట్ ప్రొడక్షన్ లో చైతు ‘లవ్ స్టోరీ’ టాలీవుడ్లో ఎప్పటి నుంచో రెండు టీజర్లపై ఆసక్తి నెలకొంది. అందులో […]

Written By: NARESH, Updated On : October 7, 2020 5:22 pm
Follow us on

ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈనేపథ్యంలోనే ఈ మూవీ నుంచి త్వరలో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాషీ గా ఉన్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ టీజర్ పైనే చర్చ నడుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ పై పడినట్లు కన్పిస్తోంది.

Also Read: పోస్ట్ ప్రొడక్షన్ లో చైతు ‘లవ్ స్టోరీ’

టాలీవుడ్లో ఎప్పటి నుంచో రెండు టీజర్లపై ఆసక్తి నెలకొంది. అందులో ఒకటి ఆర్ఆర్ఆర్ టీజర్ కాగా మరొకటి ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ టీజర్. ఆర్ఆర్ఆర్ షూటింగు ఇటీవలే ప్రారంభంకాగా ఎన్టీఆర్ టీజర్ పై డేట్స్ కూడా అనౌన్స్ చేసింది. కాగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించి టీజర్ ఎప్పుడంటే ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిన్నటిగాక మొన్న ప్రారంభమైన ‘ఆదిపురుష్’ సైతం ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ దూసుకెళుతుంది. ఈ చిత్రానికి ఫస్టు లుక్కుతోపాటు ఇటీవల విలన్ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ రిలీవ్ చేసింది. అక్టోబరులో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హీరోయిన్ పై ప్రకటన చేయబోతుంది.

Also Read: త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ ఆసక్తికర ట్వీట్

అయితే ఎప్పటి నుంచే ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ జరుపుకుంటోంది. అయినా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా తెలియడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి కావాల్సినంత ఫుటేజ్ ఉన్నా టీజర్ విషయంలో చిత్రబృందం ఎలాంటి ప్రకటించడం లేదు. కనీసం ప్రభాస్ బర్త్ డేకైనా టీజర్ వస్తుందనిగానీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో యూవీ క్రియేషన్స్ నిర్మాతలపై ప్రభాస్ ఫ్యాన్స్ గరమవుతున్నారు.