Raja Saab Poster: ప్రభాస్ ‘రాజా సాబ్’ నుండి సరికొత్త పోస్టర్ విడుదల..టీజర్ గురించి సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

ఎట్టకేలకు అభిమానుల కోరికని మన్నించి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని అక్టోబర్ 23వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా, అద్దాలు పెట్టుకొని నిలబడడం చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ ని వింటేజ్ లుక్స్ లో అభిమానులు చూసి చాలా కాలం అయ్యింది.

Written By: Vicky, Updated On : October 21, 2024 4:25 pm

Raja Saab Poster

Follow us on

Raja Saab Poster: రెబల్ స్టార్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రపంచం లో అత్యంత భారీ సెట్ ను ఈ సినిమా కోసం నిర్మించారట. అక్కడ గత కొద్ది రోజులుగా ప్రభాస్, నిధి అగర్వాల్ మరియు ఇతర తారాగణం పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన బ్రాండ్ న్యూ పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈ చిత్రం నుండి ఏదైనా అప్డేట్ ఇవ్వమని మేకర్స్ ని ట్యాగ్ చేసి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో పోస్టులు వేస్తూ ఉన్నారు.

అయితే ఎట్టకేలకు అభిమానుల కోరికని మన్నించి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని అక్టోబర్ 23వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా, అద్దాలు పెట్టుకొని నిలబడడం చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ ని వింటేజ్ లుక్స్ లో అభిమానులు చూసి చాలా కాలం అయ్యింది. బాహుబలి సిరీస్ తర్వాత అన్ని పాన్ ఇండియన్ సినిమాలే చేయడంతో రెగ్యులర్ కమర్షియల్ మూవీ లవర్స్ కి ప్రభాస్ కాస్త దూరం అయ్యాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే డైరెక్టర్ మారుతీ తో రాజా సాబ్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. సినిమాని ఆపేయండి అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ కి మారుతీ లాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా ఏమిటి?, పైగా అతని గత చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ స్టార్ స్టేటస్ పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగింది. ఇలాంటి సమయంలో మారుతీ లాంటి డైరెక్టర్ తో సినిమా చేసి ఫ్లాప్ అయితే ఆ అవమానం ని తట్టుకోలేము అంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు.

కానీ గ్లిమ్స్ వీడియో తో అభిమానులను సర్ప్రైజ్ చేసాడు. ఇక నేడు విడుదల చేసిన పోస్టర్ తో వింటేజ్ ప్రభాస్ ని చూపించి, బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాము అనే పాజిటివిటీ ని నింపాడు డైరెక్టర్ మారుతీ. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లు గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈమధ్య కాలం లో హారర్ కామెడీ జానర్ లో వచ్చిన సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించాయి. అలాంటి ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఇలాంటి జానర్ లో చేస్తున్నాడంటే ఆకాశమే హద్దు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.