Pawan Kalyan’s ‘OG’ : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి సరికొత్త పోస్టర్ విడుదల.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ ఇచ్చిన టీం!

Pawan Kalyan's 'OG' గత 15 రోజుల నుండి అమరావతి లో 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

Written By: NARESH, Updated On : October 19, 2024 6:44 pm

New poster release from Pawan Kalyan's 'OG'

Follow us on

Pawan Kalyan’s ‘OG’ : కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ‘ఓజీ’ అనే పేరు తీస్తే చాలు, అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు ‘ఓజీ..ఓజీ’ అని సభా ప్రాంగణం దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం వరకు తాత్కాలికంగా ఆగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేయడానికి డేట్స్ కేటాయించాడు.

గత 15 రోజుల నుండి అమరావతి లో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ తో పాటు, పలువురు ముఖ్య తారాగణం పాల్గొనగా, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యం లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. రేపటి నుండి హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, విలన్ ఇమ్రాన్ హష్మీ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం.

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా కత్తి పట్టుకొని కార్ పక్కన నిల్చోవడం డార్క్ షేడ్ లో చూపిస్తారు. ఆయన వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఇండియా గేట్ కనిపిస్తుంది. ఆకాశం మొత్తం ఎరుపు రంగు అలుముకొన్నట్టుగా డిజైన్ చేసారు. అలాగే మరోవైపు బాంబులు పేలుడుని కూడా పోస్టర్ లో చూపించారు. చాలా సింపుల్ గా త్వరలోనే పవన్ కళ్యాణ్ ఓజీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు అనే విషయాన్ని పరోక్షంగా తెలియచేసారు నిర్మాతలు. నవంబర్ నెలాఖరు లోపు మూవీ షూటింగ్ ని పూర్తి చేసి, వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అలాగే అతి త్వరలోనే ఈ సినిమాలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. ఈ పాటని ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో శింబు పాడాడు. ఇటీవలే ఈ పాటని రికార్డు చేసారు. సెప్టెంబర్ 2న ఒక పోస్టర్ ద్వారా లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఉన్నందున తాత్కాలికంగా వాయిదా వేశారు. దీపావళికి లిరికల్ వీడియో సాంగ్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.