సినీ కార్మికులకు నయనతార భారీ విరాళం

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా పాకింది. దీంతో జనజీవనం స్తంభించిందిపోయింది. ప్రజా రవాణ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పడ్డాయి. సినిమా షూటింగ్ లు వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రోజువారి దినసరి వేతనంపై పని చేసే సినీ కార్మికులు […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 3:13 pm
Follow us on


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా పాకింది. దీంతో జనజీవనం స్తంభించిందిపోయింది. ప్రజా రవాణ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పడ్డాయి. సినిమా షూటింగ్ లు వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రోజువారి దినసరి వేతనంపై పని చేసే సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీని కార్మికులను ఆదుకునేందుకు పలువురు సెలబ్రెటీలు తమవంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా సౌత్ ఇండియా క్వీన్, లేడి సూపర్ స్టార్ నయనతార సీని కార్మికుల కోసం రూ.20లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియాకు రూ.20లక్షల విరాళం ప్రకటించింది. కరోనాని జయించేందుకు ప్రతీఒక్కరు ఇళ్లల్లోనే నయనతార కోరుతుంది. ఇప్పటివరకు హీరోయిన్లు ప్రకటించిన విరాళాల్లో నయనతారనే టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. నయనతార సినీ కార్మికులకు భారీ విరాళం అందించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.