Malli Pelli Movie: ‘మళ్ళీ పెళ్లి’ మూవీ కి దిమ్మతిరిగే బిజినెస్..ఈ రేంజ్ క్రేజ్ ఊహించలేదు

ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లిద్దరి బయోపిక్ ని తీసారని విషయం అందరికీ అర్థం అయిపోతుంది. అయితే సోషల్ మీడియా లో వీళ్లిద్దరి పై ఒక రేంజ్ లో నెగటివిటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ నెగటివిటీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి 15 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది అంటూ చెప్పడం మనమంతా చూసాము.

Written By: Vicky, Updated On : May 26, 2023 9:45 am

Malli Pelli Movie

Follow us on

Malli Pelli Movie: ఈమధ్య నెగటివ్ పబ్లిసిటీ తో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ కూడా అదే టెక్నిక్ తో ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రాన్ని తీసి వార్తల్లో నిలిచాడు. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం, ఆమెని పెళ్లి చేసుకోవడం వంటి సంఘటనలు రీసెంట్ గా సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది.

దీనికి నరేష్ మూడవ భార్య రమ్య రచ్చ రచ్చ చెయ్యడం, కర్ణాటక లో వీళ్లిద్దరు ఒక రూమ్ లో ఉన్నారనే విషయం తెలుసుకున్న రమ్య మీడియా ని వెంటవేసుకొని వెళ్లి నరేష్ ని చెప్పుతో కొట్టే ప్రయత్నం చెయ్యడం , దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం వంటివి మనం ఎన్నో చూసాము. రీసెంట్ గా విడుదల చేసిన ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ ఈ సంఘటనలకు సంబంధించిన సన్నివేశాలన్నీ ఉన్నాయి.

ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లిద్దరి బయోపిక్ ని తీసారని విషయం అందరికీ అర్థం అయిపోతుంది. అయితే సోషల్ మీడియా లో వీళ్లిద్దరి పై ఒక రేంజ్ లో నెగటివిటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ నెగటివిటీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి 15 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది అంటూ చెప్పడం మనమంతా చూసాము.

వాస్తవానికి అంత ఖర్చు కాలేదట కానీ 8 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ అయ్యిందట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత MS రాజు దర్శకత్వం వహించాడు. అయితే నరేష్ కి ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ నుండే 8 కోట్ల రూపాయిలు రికవర్ అయ్యాయని, థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో నాలుగు కోట్ల రూపాయిలు వచ్చిందని అంటున్నారు. మరి విడుదల తర్వాత థియేటర్స్ నుండి ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో చూడాలి.