Homeఎంటర్టైన్మెంట్Kalyan Ram: బింబిసార ఇచ్చిన ఊపు: మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్

Kalyan Ram: బింబిసార ఇచ్చిన ఊపు: మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్

Kalyan Ram: కళ్యాణ్ రామ్.. ప్రతిభ ఉన్న నటుడే. కానీ ఎందుకో అదృష్టం అతడి తలుపు తట్టడం లేదు. అప్పుడెప్పుడో పటాస్ విజయం తర్వాత ఏడేళ్లు ఎదురు చూస్తే గాని బింబిసార రూపంలో మరో హిట్ అతడికి లభించలేదు. ఈ చిత్రం ఇచ్చిన ఊపు కావచ్చు. కళ్యాణ్ రామ్ మరింత సెట్టిల్డ్ గా సినిమాలు చేస్తున్నాడు. బింబిసారకు సీక్వెల్ కూడా ఉంటుందని ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఆమధ్య కళ్యాణ్ రామ్ హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో అమిగోస్ అనే సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. సోమవారం ఉదయం ఈ చిత్రానికి సంబంధించి ప్రచార పోస్టర్ విడుదలైంది. అందులో మూడు రూపాల్లో కళ్యాణ్ రామ్ కనిపించాడు. ప్రచార పోస్టర్ కింద ” మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు మీరు చనిపోతారని వారు అంటున్నారు” అని రాసుకొచ్చారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కు జోడిగా కన్నడ నటి అశిక రంగనాథ్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీత దర్శకుడు. రాజేంద్రనాథ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Kalyan Ram
Kalyan Ram

ఎన్టీఆర్ రూట్లో..

ఐదేళ్ల క్రితం ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో జై లవకుశ అనే సినిమా వచ్చింది. దీనిని కళ్యాణ్ రామ్ నిర్మించాడు. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాశి ఖన్నా, నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. వైకల్యంతో బాధపడే ఓ వ్యక్తి తీర్చుకునే రివెంజ్ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దారిలోనే కళ్యాణ్ రామ్ వెళ్తున్నాడు. మైత్రి మూవీస్ ప్రకటించిన అమిగోస్ చిత్రంలో మూడు పాత్రల్లో నటించబోతున్నాడు. అన్నట్టు అమిగోస్ అంటే ఇంగ్లీషులో మిత్రుడు అని అర్థం వస్తుంది. ” ఊహించిన వాటిని ఆశించండి. లేదా మీలాగే కనిపించే వారిని ఆశించండి” అని అర్థం వచ్చేలా కింది పోస్టర్లో రాసుకుంటూ వచ్చారు. బింబిసార చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సీతారామం తో పాటుగా విడుదలై చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరి ఇచ్చింది.

Kalyan Ram
Kalyan Ram

ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్

తన కెరీర్ ప్రారంభం నుంచి కళ్యాణ్ రామ్ విభిన్నమైన సినిమాల్లో నటించాడు. అతనొక్కడే, హరే రామ్, ఓం, ఎమ్మెల్యే, 116 వంటి సినిమాలు అతనిలో ఉన్న విలక్షణమైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా! నటి స్తుండడం వల్ల కళ్యాణ్ రామ్ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన బింబిసారతో ఆ అంచనాలను కళ్యాణ్ రామ్ అందుకున్నాడు. తాజాగా అమిగోస్ అనే చిత్రానికి పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమా ప్రచార పోస్టర్ లో చూపించిన చిత్రాల ఆధారంగా ఇది ఒక థ్రిల్లర్ జోనర్ అని అర్థమవుతుంది. పోస్టర్లో కనిపించే మూడు పాత్రల్లో ఒకదాంట్లో నీట్ గా, ఒకదాంట్లో రఫ్ లుక్ లో, ఇంకో చిత్రంలో చేతిలో తుపాకీతో కనిపిస్తున్నాడు. ఈ ప్రకారం ఈ మూడు పాత్రలు వేటికి అవే భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఒకవేళ ఈ సినిమా కనుక ప్రేక్షకులను అలరిస్తే కళ్యాణ్ రామ్ పంట పండినట్టే.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version